Just NationalJust CrimeLatest News

Juvenile Offenders: బాల నేరస్తుల శిక్షపై పార్లమెంట్‌లో హాట్ డిబేట్.. జువైనల్ వయసు 14కు తగ్గించాలని డిమాండ్ ఎందుకు?

Juvenile Offenders: 17 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలను బాలలుగా పరిగణించబడుతుండగా, ఈ వయస్సును తగ్గించి, 14 సంవత్సరాలుగా చేయాలని రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి తీవ్ర డిమాండ్లు వస్తున్నాయి.

Juvenile Offenders

దేశంలో అత్యంత క్రూరమైన నేరాలు, దారుణ హత్యలు, అత్యాచారాల వంటి వాటిలో పాల్గొంటున్న బాల నేరస్తుల(Juvenile Offenders) అంశం మరోసారి దేశవ్యాప్త చర్చకు తెర లేపింది. ప్రస్తుతం జువైనల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం 17 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలను బాలలుగా పరిగణించబడుతుండగా, ఈ వయస్సును తగ్గించి, 14 సంవత్సరాలుగా చేయాలని రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి తీవ్ర డిమాండ్లు వస్తున్నాయి.

ఈ సమయంలో తాజాగా ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ లోక్‌సభలో ఒక ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు ప్రకటించారు. 15 నుంచి 17 ఏళ్ల లోపు వారు అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలను తాను నిరంతరం చూస్తున్నానని, ఒక బాలుడు మూడు హత్యలకు కారణమైన విషయం, మరొకరు కరెక్షన్ సెంటర్ నుంచి తిరిగి వచ్చాక కూడా హత్యకు పాల్పడిన ఉదంతాలను ప్రస్తావిస్తూ, బాలల వయస్సును 14 సంవత్సరాలకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Juvenile Offenders
Juvenile Offenders

బాలలు నేరాల(Juvenile Offenders)కు పాల్పడటానికి ప్రధాన కారణాలు ఆర్థిక సమస్యలు, కుటుంబ వాతావరణం, హింసకు గురికావడం, నేరపూరిత ముఠాలలోకి ఆకర్షించబడటం. గురుగ్రామ్‌లో 17 ఏళ్ల విద్యార్థి తన తండ్రి లైసెన్స్‌డ్ పిస్టల్‌తో స్కూల్‌మేట్‌పై కాల్పులు జరపడం, ఢిల్లీ పటేల్ నగర్‌లో ప్రత్యర్థి ముఠా సభ్యుడిపై హత్యాయత్నం కేసులో మైనర్లను అరెస్టు చేయడం వంటి ఉదంతాలు, మైనర్‌లు ఎంతటి దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారో తెలియజేస్తున్నాయి.

జువైనల్ జస్టిస్ చట్టం యొక్క ఉద్దేశం బాలలను శిక్షించడం కాదు, వారిని సంస్కరించడం (Reformation) , సమాజంలో తిరిగి కలిసిపోయేలా చేయడం. అయితే, అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన మైనర్‌లు, జువైనల్ చట్టం యొక్క లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుని, పెద్దల మాదిరిగా కఠిన శిక్షల నుంచి తప్పించుకున్నారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కొన్ని ఉదంతాలలో మైనర్‌లు పెద్ద శిక్షల నుంచి మినహాయింపు పొందిన కొన్ని ముఖ్యమైన కేసులను ఒకసారి చూద్దాం.

నిర్భయ కేసు (2012).. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అత్యంత క్రూరమైన సామూహిక అత్యాచారం , హత్య కేసులో ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనర్. నేరం జరిగిన సమయంలో అతనికి 17 సంవత్సరాల 6 నెలల వయస్సు ఉంది. ఈ కేసు దేశవ్యాప్తంగా జువైనల్ చట్టంపై చర్చకు దారి తీసింది. అప్పటి చట్టం ప్రకారం, అతను మైనర్ కావడంతో, అతన్ని జువైనల్ హోమ్‌కు పంపారు. అక్కడ అతను కేవలం మూడేళ్లు ఉండి, తన 20 ఏళ్ల వయస్సులో శిక్ష పూర్తి కాకుండానే విడుదలయ్యాడు. చట్టం ప్రకారం, ఈ క్రూరమైన నేరానికి అతను పొందిన శిక్ష చాలా తక్కువ. నేరం యొక్క తీవ్రత దృష్ట్యా అతను కూడా పెద్దవారి మాదిరిగానే శిక్ష అనుభవించాలని దేశమంతా డిమాండ్ చేసినా కూడా , చట్టం అతనికి రక్షణ కల్పించింది.

Juvenile Offenders
Juvenile Offenders

పూణే కారు ప్రమాదం (2024).. ఇటీవల పూణేలో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం కేసులో ఒక సంపన్న వ్యాపారవేత్త 17 ఏళ్ల కుమారుడు తన లగ్జరీ కారుతో ఇద్దరు ఐటీ ఇంజనీర్లను ఢీకొట్టి చంపాడు. అతనికి నేరం జరిగిన సమయంలో కేవలం 17 సంవత్సరాల 8 నెలల వయస్సు ఉంది. జువైనల్ జస్టిస్ బోర్డు మొదట అతనికి కేవలం 14 గంటల కమ్యూనిటీ సేవ , రోడ్డు భద్రతపై ఒక వ్యాసం రాయాలని ఆదేశించింది, ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తర్వాత ఒత్తిడి పెరగడంతో, అతనికి పెద్దవారిగా పరిగణించి విచారణ జరిపేందుకు కోర్టు అనుమతించింది.

పాఠశాల విద్యార్థి హత్య కేసులు.. బాల నేరస్తులు (Juvenile Offenders)పాల్పడిన కొన్ని దారుణమైన హత్య కేసులలో (ఉదాహరణకు, పాఠశాల ప్రాంగణంలోనే చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన కొన్ని కేసుల్లో), నేరానికి పాల్పడిన వ్యక్తి 17 ఏళ్ల లోపు వయస్కుడై ఉండటం వల్ల, కఠినమైన శిక్షల నుంచి మినహాయింపు పొంది, కేవలం సంస్కరణ కేంద్రంలో కొన్ని సంవత్సరాలు ఉండి విడుదలైన ఉదంతాలు అనేకం ఉన్నాయి.

ఈ ఉదంతాలన్నీ జువైనల్ ఏజ్‌ను తగ్గించాలనే డిమాండ్‌కు బలాన్ని చేకూరుస్తున్నాయి. క్రూరమైన నేరాలకు పాల్పడే 16-17 ఏళ్ల వయస్కులను కూడా పెద్దలుగా పరిగణించి, వారి నేర తీవ్రతకు అనుగుణంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, లేదంటే ఈ చట్టం నేరగాళ్ల(Juvenile Offenders)కు రక్షణ కవచంగా మారుతుందని మేధావులు, రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button