Gold:పసిడి ప్రియులకు షాక్..కొత్త ఏడాదిలో కూడా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold: బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా సామాన్యులకు భారీగానే షాక్ ఇచ్చింది.

Gold

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో ఉన్న సామాన్యులకు పసిడి(Gold) ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, ఈరోజు అంటే జనవరి 2న మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మార్పులతో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈరోజు ధరలు (Gold)ఇలా ఉన్నాయి.

Gold price

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే కొత్త ఏడాదిలో చాలామంది పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపించడం అలాగే డాలర్ విలువలో మార్పులు , స్టాక్ మార్కెట్ల అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

దీనికి తోడు మన దేశంలో త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటతో అప్పుడు ధరలు ఎలా ఉంటాయోనని కొంతమంది ఇప్పుడే కొని పెట్టుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు.దీంతోనే బంగారం , వెండి ధరలు డిమాండ్ పెరిగి, ధరలు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version