Revanth Reddy: రూటు మార్చిన రేవంత్ రెడ్డి.. నయా స్ట్రాటజీ దానికోసమేనా?

Revanth Reddy: ఒకవైపు పాలనాపరమైన సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలకమైన అడుగు వేశారు.

Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఆరుగురు మంత్రులతో కూడిన బృందంతో ఢిల్లీలో కీలక పర్యటనలు, సమావేశాలు ముగించుకొని, నేరుగా బీహార్‌కు వెళ్లడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇది కేవలం ఒక టూర్ మాత్రమే కాదు, ఒకేసారి పరిపాలనాపరమైన, రాజకీయపరమైన లక్ష్యాలను సాధించాలన్న ఆయన వ్యూహానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఢిల్లీలో ఆయన పర్యటన ప్రధానంగా వెనుకబడిన తరగతులకు (BCలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై దృష్టి పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన, ఆమోదించిన రెండు రిజర్వేషన్ బిల్లులు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్.. ఇవన్నీ ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ సమస్యలను అధిగమించడానికి, న్యాయ మార్గాలను అన్వేషించడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసింది. ఈ భేటీలో సింఘ్వి, స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలనే దానిపై విలువైన న్యాయ సలహాలు అందించారు. ఈ అంశంపై ఒక నివేదికను ఆగస్టు 29న జరిగే కేబినెట్ సమావేశంలో సమర్పించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

Revanth Reddy

అంతేకాకుండా, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువుపైనా ఈ బృందం న్యాయ సలహా తీసుకున్నట్లు సమాచారం. అలాగే, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) , ఆయన బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ను కలుసుకుని, బీసీ కోటాపై అందిన సలహాలను వివరించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం యొక్క భవిష్యత్ ఎన్నికల ప్రణాళికలు, నామినేటెడ్ పోస్టుల నియామకాలపైనా చర్చ జరిగింది.

ఒకవైపు పాలనాపరమైన సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలకమైన అడుగు వేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొనేందుకు ఆయన మంత్రులు , టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి వెళ్లారు. ఈ యాత్రను రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాల్లో జరిగిన అక్రమాలను ఎత్తిచూపుతూ, ప్రజల ఓటు హక్కును కాపాడటానికి ఓట్ చోరీ క్యాంపెయిన్లో భాగంగా నిర్వహిస్తున్నారు.

ఈ మొత్తం పరిణామాలతో, రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేవలం తెలంగాణ రాజకీయాలపైనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Bigg Boss:బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఒక ఆట ఆడుకుంటున్న నవదీప్

Exit mobile version