Scandal in TTD: టీటీడీలో మరో కుంభకోణం ..భక్తులకు కప్పే పట్టు వస్త్రం కొనుగోలులో భారీ మోసం

Scandal in TTD:వేద ఆశీర్వచనం టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శాలువా కప్పి ఆశీర్వదించడం ఆనవాయితీ.

Scandal in TTD

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన , పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. మొన్న లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, ఆ తర్వాత పరకామణిలో చేతివాటం వంటి వివాదాలు చల్లారకముందే, తాజాగా మరో భారీ మోసం బయటపడింది. అది, శ్రీవారి ఆలయంలో భక్తులకు కప్పే పట్టు వస్త్రం కొనుగోలులో(Scandal in TTD) జరిగిన భారీ కుంభకోణం.

వేద ఆశీర్వచనం టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వస్త్రాన్ని (శాలువా) కప్పి ఆశీర్వదించడం ఆనవాయితీ. ఈ వస్త్రం పూర్తిగా మల్బరీ పట్టు (Mulberry Silk) వస్త్రమై ఉండాలి.

అయితే సరఫరాదారులు మల్బరీ పట్టు వస్త్రం (Scandal in TTD)పేరుతో, దానికి బదులుగా పాలిస్టర్ వస్త్రం (Polyester Fabric) ను కొనుగోలు చేసి సప్లయ్ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు.

నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ , దాని అనుబంధ సంస్థలు 2015 నుంచి 2025 వరకు (పదేళ్ల సుదీర్ఘ కాలం) ఈ వస్త్రాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీటీడీకి సరఫరా చేశాయి.

ఒక్కో వస్త్రం ఖరీదు రూ. 1,389 గా నిర్ణయించి, మొత్తం 21 వేల వస్త్రాలను టీటీడీ కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్‌లో ఈ పాలిస్టర్ వస్త్రం (దుప్పట్ట) ఖరీదు కేవలం రూ. 200 మించి ఉండదని అంచనా. ఈ లెక్కన టీటీడీకి కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది.

టీటీడీకి సరఫరా చేసిన వస్త్రంపై అనుమానం రావడంతో, దీనిని బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ లేబరేటరీలో పరీక్షలకు పంపగా, ఆ పరీక్షల్లో ఈ వస్త్రంలో (Scandal in TTD)పట్టు లేదని, ఇది పూర్తిగా పాలిస్టర్ తో కూడినదని నిర్ధారణ అయ్యింది. ఈ నివేదిక ఆధారంగా టీటీడీ పాలక మండలి తాజాగా ఈ కుంభకోణంపై ఏసీబీ (Anti-Corruption Bureau) దర్యాప్తు జరపాలని నిర్ణయించింది.

రెండు నెలల క్రితమే బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. నిపుణుల కమిటీ , టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికలో ఈ అక్రమాలు స్పష్టంగా వెల్లడయ్యాయి.

వేద ఆశీర్వచనంలో భక్తులకు కప్పే వస్త్రాలకు నాణ్యత లేదని ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక నిర్ధారించింది.

పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ ఆరోపించిన ప్రకారం, కేవలం భక్తులకు కప్పే వస్త్రాలు మాత్రమే కాదు, శ్రీవారికి అలంకరించే మేల్ చాట్ వస్త్రాలలో కూడా పట్టు లేకపోవడం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు.

ఈ కుంభకోణాన్ని రాజకీయ కోణంలో చూడటం లేదని, శ్రీవారి పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని భాను ప్రకాష్ స్పష్టం చేశారు. ఐదేళ్లలో (2019-2024) శ్రీవారి ఆస్తులకు సరైన రక్షణ లేకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

ప్రాథమిక నివేదికల ఆధారంగా, టీటీడీ బోర్డు ఈ కేసు విచారణను ఏసీబీ (Anti-Corruption Bureau) కి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ CVSO ఇప్పటికే ఏసీబీ డీజీకి లేఖ రాశారు.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా ఈ వరుస అక్రమాలపై స్పందించారు. కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేయడం వల్లే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. పరకామణి వివాదంపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ, హిందూ మత విషయాలను చిన్నచూపు చూడటం సరికాదని ప్రశ్నించారు.

 

Scandal in TTD

ఇదే కాదు ఇటీవల కాలంలో టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా వెలుగు చూస్తున్న పలు కుంభకోణాలు టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా చేస్తున్నాయి.

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కొనుగోలులో కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. భక్తులకు అందించే పవిత్రమైన ప్రసాదంలో నాణ్యతా లోపాలు ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

పరకామణిలో చేతివాటం (దొంగతనం).. శ్రీవారి ఆలయంలోని పరకామణిలో భక్తులు సమర్పించిన కానుకలు, నగదు లెక్కింపు ప్రక్రియలో కొందరు సిబ్బంది చేతివాటం చూపించిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి.

ఇప్పుడు పట్టు వస్త్రంలో మోసం.. తాజా కుంభకోణంలో, భక్తులకు ఆశీర్వచనంగా కప్పే వస్త్రంలోనే నకిలీని ఉపయోగించడం ద్వారా, భక్తుల విశ్వాసాలను, పవిత్రతను మోసం చేయడం జరిగింది.

దేవదేవుడి సన్నిధిలో, కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు కేంద్రమైన ఈ పవిత్ర స్థలంలో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు జరగడం అత్యంత బాధాకరం. మానవులను మోసం చేయడంతో సరిపెట్టుకోక, దేవుడి పేరుతో, భక్తి ముసుగులో ఇలాంటి పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.

టీటీడీలో జరిగే వేల కోట్ల టర్నోవర్‌తో, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని భావించే వ్యక్తుల్లో విపరీతమైన ధనకాంక్ష పెరగడం.

కాంట్రాక్టులు, కొనుగోళ్ల విషయంలో పారదర్శకత లేకపోవడం లేదా ఆడిటింగ్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం.

సరఫరా చేసిన వస్తువుల నాణ్యతను (క్వాలిటీ కంట్రోల్) పదేళ్లపాటు గుర్తించలేకపోవడం పర్యవేక్షణా వైఫల్యాన్ని సూచిస్తుంది. దేవస్థానంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు, అధికారుల్లో లేదా కాంట్రాక్టర్లలో దైవభీతి, పవిత్రత పట్ల గౌరవం లోపించడం.

దేవుడి సన్నిధిలో జరిగే ఈ మోసాలు కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాక, టీటీడీ యొక్క పవిత్రతపై ,భక్తుల విశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఈ వరుస సంఘటనల వల్ల పాలక మండలి పూర్తి ప్రక్షాళన చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version