Hackers attack
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, ఆన్లైన్ లావాదేవీల సౌలభ్యంతో పాటు సైబర్ భద్రతకు సంబంధించిన సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక కఠినమైన సత్యం వెలుగులోకి వచ్చింది. ‘బ్లాక్ క్లౌడ్’ అనే ఒక హ్యాకర్ల బృందం మన దేశంలోని నాలుగు ప్రధాన బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని భారీ సైబర్ దాడులు(Hackers attack) నిర్వహించింది. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం ,సైబర్ భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
‘బ్లాక్ క్లౌడ్’ హ్యాకర్లు(Hackers attack) అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ దాడులకు పాల్పడ్డారు. వారు ఫిషింగ్, మాల్వేర్, రాన్సమ్వేర్ వంటి పద్ధతులను ఉపయోగించి బ్యాంకు సర్వర్లను వినియోగదారుల ఆన్లైన్ ఖాతాలను టార్గెట్ చేశారు. వారి ప్రధాన లక్ష్యం భారీ మొత్తంలో డేటాను దొంగిలించడం, ఆర్థిక లావాదేవీలను మార్చడం , అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం. భారతీయ సైబర్ భద్రతా సంస్థలు ఈ దాడులను గుర్తించి, నాలుగు పెద్ద బ్యాంకులపై లక్ష్యం ఉందని వెల్లడించాయి.
ఈ సైబర్ దాడుల(Hackers attack)తో, భారత ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే స్పందించాయి. RBI అన్ని బ్యాంకులకు భద్రతా ప్రోటోకాల్స్ను మరింత కఠినతరం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, వినియోగదారులకు భద్రతను పెంచేందుకు అదనపు రక్షణ పొరలను (Security Layers) ఏర్పాటు చేయాలని, అలాగే ప్రజలకు ఫిషింగ్ , స్కామ్ల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఇక ఈ దాడులపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (NIA) దర్యాప్తును వేగవంతం చేసింది.
మీ డిజిటల్ భద్రత మీ చేతుల్లోనే
సైబర్ దాడుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మీ ఆన్లైన్ బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లను తరచుగా మార్చుకుంటూ ఉండండి. మీకు ఇమెయిల్, SMS లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
వీలైనంత వరకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(Two-factor authentication) ఫీచర్ను ఎనేబుల్ చేసుకోండి.లావాదేవీల కోసం ఎల్లప్పుడూ బ్యాంకుల అధికారిక యాప్లు లేదా వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి. మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే వెంటనే మీ బ్యాంకుకు సమాచారం అందించండి. భారత డిజిటల్ భవిష్యత్తును సురక్షితం చేయడానికి ప్రభుత్వం, బ్యాంకులు, వినియోగదారులు అందరూ కలిసి పనిచేయడం అత్యంత అవసరం.