Congress: అధికారంలోనే పాదయాత్రలు.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదేనా?

Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మీనాక్షి నటరాజన్ చేసిన వ్యూహాత్మక పాదయాత్ర, ప్రజల నుండి నేరుగా స్పందన పొందడమే లక్ష్యం. ఇది గవర్నెన్స్ మెరుగుపర్చడంలో సహాయపడుతుందా? పూర్తి విశ్లేషణ కోసం చదవండి.

Congress

తెలంగాణ(telangana)లో కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికూడా పూర్తవ్వకముందే… పార్టీకి పూనాన్ని తీసి, ప్రజల పల్లెలోకి నడిచి అడుగడుగునా స్పందన తెలుసుకుంటామంటూ పాదయాత్ర పేరుతో మీనాక్షి నటరాజన్‌ రంగంలోకి దిగారు. ఇది సాధారణ పాదయాత్ర కాదు… ఎన్నికల వేళ ఓటు కోసం చేసే డ్రామా మాత్రం కచ్చితంగా కాదు.

ఇది ఓ వ్యూహాత్మక ప్రయత్నం. ప్రజల్లో మెరుగైన అవగాహన తీసుకురావడం, అధికారంలో ఉన్న పార్టీ పనితీరుపై నేరుగా స్పందన తెలుసుకోవడం లక్ష్యం. ఇదే టైంలో పాదయాత్ర చేయడం వల్ల—ఇది కాంగ్రెస్ పార్టీకి బలాన్నివ్వడమే కాకుండా, భవిష్యత్తు వ్యూహానికి వెనుకబలంగా పనిచేస్తుంది. అధికారంలో ఉండి ప్రజల్లోకి వెళ్లడం అంటే… కేవలం నమ్మకమే కాదు, నడకతోనే నమ్మకం పొందాలన్న ప్రయత్నం.

విపక్షం ఉన్నప్పుడు పాదయాత్రలు చేయడం అలవాటు. అధికారంలో ఉన్నప్పుడు చేసేందుకు తలపెట్టిన కాంగ్రెస్‌(Congress)కు ఇది నిదర్శనంగా మారింది. కానీ ఇది వర్కవుట్ అవుతుందా అనేది రెండు కోణాల్లో చూస్తున్నారు విశ్లేషకులు.

Congress

ప్రజల్లో మెదిలే సమస్యలను నేరుగా తెలుసుకోవడం. గ్రౌండ్ లెవెల్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పాలనను మెరుగుపరచే అవకాశం. దీంతో పబ్లిక్‌కు ప్రభుత్వం పట్ల ఉన్న గ్యాప్ తగ్గిపోతుంది. ఇది ఆపరేషన్ సుస్థిరతకు పునాదిగా మారొచ్చు. అయితే ఎన్నికల ముందు చేసిన పాదయాత్రే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా నడవాల్సిన పరిస్థితి అంటే.. ఏమన్నా గ్యాప్ ఉందా? అన్న అనుమానాలు కలిగే ఛాన్స్ ఉంది.

ఈ పాదయాత్ర ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ కనెక్షన్(public connection) ముద్ర పడితే.. బీఆర్ఎస్ తిరిగి గట్టెక్కే మార్గాలు మరింత సంక్లిష్టమవుతాయి. అటు శ్రేణుల్లోనూ ఎనర్జీ పెరుగుతుంది. ఇక ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (BRS) మాత్రం అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇంతలోనే పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న మాట అంటూ దుష్ప్రచారానికి తెరలేపే అవకాశం ఉంది.

మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పాదయాత్ర ఒక ఇన్‌టర్నల్ ఇన్‌స్పెక్షన్ అనే చెప్పాలి. బయటకు ఇది జనాలకు దగ్గరయ్యే మార్గంగా కనిపించొచ్చు. కానీ అసలే పార్టీ ఫంక్షనింగ్, బూత్ స్థాయి క్యాడర్ పనితీరు, ప్రజా స్పందన అన్నీ తెలుసుకునే స్క్రీనింగ్ టూల్‌గా కూడా పనిచేస్తోంది. ఈ విషయాలను రాబట్టేందుకే మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపింది అధిష్టానం.

Congress-Meenakshi Natarajan

మరోవైపు ఈ స్టైల్‌లో కాంగ్రెస్ ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ముందుకు వెళ్లాలని చూస్తోంది. ప్రజలే పాలకులుగా మారే పబ్లిక్ పార్టిసిపేషన్ పాలసీకి ఇది ఒక మెరుగైన ప్రారంభంగా మార్చాలన్నదే ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీగా (Congress strategy) తెలుస్తోంది.

Also Read: Cinema : వీడెక్కడి నటుడండీ ..దక్షిణాది సినిమా భవిష్యత్తులా ఉన్నాడే..!

Exit mobile version