Education:పేద విద్యార్థులకు గుడ్‌న్యూస్: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు నోటిఫికేషన్

Education: గతంలో భర్తీ చేయగా మిగిలిపోయిన ఖాళీ సీట్లను ఈ అదనపు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇది పేద, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.

Education

ఆంధ్రప్రదేశ్‌లోని పేద, బలహీన వర్గాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత విద్య(Education)ను అందించేందుకు, విద్యాహక్కు చట్టం కింద కేటాయించిన సీట్లను భర్తీ చేయడానికి ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి, గతంలో భర్తీ చేయగా మిగిలిపోయిన ఖాళీ సీట్లను ఈ అదనపు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇది పేద, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య(Education)ను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అడ్మిషన్ల కోసం ఆగస్టు 12 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

అర్హతలు, నిబంధనలు (RTE చట్టం ప్రకారం).. విద్యాహక్కు చట్టం (RTE) 2009 ప్రకారం, 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అందించాలి. ఈ చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారం, ప్రైవేట్ స్కూళ్లు తమ మొదటి తరగతి సీట్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా రిజర్వ్ చేయాలి. ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలులో ఉంది.

Education

అర్హతలు:

ఈ అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగ పిల్లలకు లభిస్తుంది. ఈ అదనపు నోటిఫికేషన్ ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి మంచి విద్యను పొందే అవకాశం లభిస్తుంది. మరోవైపు, ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ 2025 కూడా విడుదలయి, దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read: Dwakra:డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ పంపిణీ ..ఎందుకీ కార్ట్?

 

 

Exit mobile version