Kargil Vijay Diwas :కార్గిల్ విజయానికి 26 ఏళ్లు..స్ఫూర్తిని రగిలిస్తున్న జ్ఞాపకాలు

Kargil Vijay Diwas :సరిగ్గా 26 ఏళ్ల క్రితం..  1999 మే-జులై నెలల మధ్య, జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ కొండలపై భారత్, పాకిస్థాన్‌ల మధ్య భీకర యుద్ధం జరిగింది.

Kargil Vijay Diwas :ఈరోజు జూలై 26, 2025, భారత దేశ చరిత్రలో అత్యంత గర్వించదగిన రోజుల్లో ఒకటిగా నిలిచిపోయిన కార్గిల్ విజయ్ దివస్‌ను మనం 26వ వార్షికోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఇదే రోజున, భారత సైన్యం అసాధారణ పరాక్రమాన్ని ప్రదర్శించి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన అపూర్వ క్షణాలు. కార్గిల్ పర్వత శ్రేణులపై పన్నాగం పన్ని, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన శత్రుమూకలను మన వీర జవాన్లు తరిమికొట్టిన మహా ఘట్టం.

Kargil Vijay Diwas

సరిగ్గా 26 ఏళ్ల క్రితం..  1999 మే-జులై నెలల మధ్య, జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ కొండలపై భారత్, పాకిస్థాన్‌ల మధ్య భీకర యుద్ధం జరిగింది. పాకిస్థాన్ సైనికులు, ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖ (LoC)ను దాటి భారత భూభాగంలోకి రహస్యంగా చొరబడ్డారు. కార్గిల్‌లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన, ఖాళీగా ఉన్న సైనిక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణను గుర్తించిన భారత సైన్యం, శత్రువుల కుట్రను భగ్నం చేయడానికి, ఆక్రమిత ప్రాంతాలను విడిపించడానికి ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భారీ సైనిక చర్యను ప్రారంభించింది.

భారత సైన్యం అసాధారణ ధైర్యం, తెగువతో పర్వత ప్రాంతాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందడుగు వేసింది. దేశభక్తితో రగిలిపోయిన మన సైనికులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, ఎత్తైన కొండలపై నుంచి పాక్ బలగాలపై మెరుపు దాడులు చేశారు. ఈ ఎదురు దాడికి తట్టుకోలేక పాక్ సేనలు వెనక్కి తగ్గాయి. చివరకు, జూలై 26న భారత సైన్యం కార్గిల్‌ను పూర్తిగా విముక్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్‌(Kargil Vijay Diwas)గా జరుపుకుంటూ, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం.

కార్గిల్ విజయ్ దివస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భారత వాయుసేన (Indian Air Force) తమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. కార్గిల్ యుద్ధం(Kargil War) నాటి హృదయవిదారక, స్ఫూర్తిదాయక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియో, ఎందరో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించిన సైనికుల ధైర్యాన్ని గుర్తు చేసింది. “అమరవీరుల ధైర్యం, త్యాగం, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అనే క్యాప్షన్ తో కూడిన ఈ వీడియో ప్రజల మనసులను కదిలించింది.

భారత వాయుసేన షేర్ చేసిన ఈ వీడియోను చూడండి..

 

ప్రధాని నరేంద్ర మోదీ కూడా కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా X వేదికగా అమరవీరులను స్మరించుకున్నారు. “దేశ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి సైనికులు తమ జీవితాలను అంకితం చేశారు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని లద్దాఖ్‌లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, సంజయ్ సేథ్.. విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ రోజు, మన వీర సైనికుల అపారమైన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ధైర్యాన్ని, నిబద్ధతను భావి తరాలకు అందించాలనే సంకల్పంతో దేశం ఏకతాటిపై నిలిచింది. వారి త్యాగాలు మనందరికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

 

Exit mobile version