Delivery
దేశంలో పోస్టల్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. ప్రైవేటు కొరియర్ సంస్థలకు దీటుగా, తన సేవలను ఆధునీకరించే దిశగా భారత తపాలా శాఖ (India Post) కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, కేవలం 24 గంటల్లోనే దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను చేరవేసే సరికొత్త ‘సూపర్ ఫాస్ట్ డెలివరీ’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం వెల్లడించారు.
- 24 గంటలు, 48 గంటల్లో గ్యారెంటీ డెలివరీ(Delivery)
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను రెండు వేర్వేరు గ్యారెంటీ డెలివరీ స్లాట్లలో అందించనున్నారు. - 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానులలో మెయిల్స్ , పార్శిళ్లు కేవలం 24 గంటల్లోపు డెలివరీ అయ్యేలా ఈ సేవను రూపొందించారు.
- 48 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్.. అదేవిధంగా, నిర్ణీత ప్రాంతాలకు మెయిల్స్ 48 గంటల్లోపు డెలివరీ కోసం మరో గ్యారెంటీ స్పీడ్ పోస్ట్ సేవను కూడా ప్రారంభిస్తారు.
Delivery - అమలు లక్ష్యం.. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సూపర్ ఫాస్ట్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది.
- ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం.. ఈ నూతన వేగవంతమైన సేవల్లో భాగంగా, ఇండియా పోస్ట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్కార్ట్ (Flipkart) వంటి సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రైవేట్ కొరియర్ సంస్థలకు ప్రధాన పోటీని ఇవ్వడానికి , దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వేగంగా సేవలను అందించడానికి భారత తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.