Delivery: సూపర్‌ ఫాస్ట్‌ డెలివరీ.. దేశంలో ఎక్కడికైనా ఇకపై 24 గంటల్లోనే పార్శిల్‌

Delivery: కేవలం 24 గంటల్లోనే దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను చేరవేసే సరికొత్త 'సూపర్‌ ఫాస్ట్‌ డెలివరీ' విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.

Delivery

దేశంలో పోస్టల్‌ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. ప్రైవేటు కొరియర్ సంస్థలకు దీటుగా, తన సేవలను ఆధునీకరించే దిశగా భారత తపాలా శాఖ (India Post) కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, కేవలం 24 గంటల్లోనే దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను చేరవేసే సరికొత్త ‘సూపర్‌ ఫాస్ట్‌ డెలివరీ’ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం వెల్లడించారు.

ప్రైవేట్ కొరియర్‌ సంస్థలకు ప్రధాన పోటీని ఇవ్వడానికి , దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వేగంగా సేవలను అందించడానికి భారత తపాలా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

Jubilee hills bypoll: రేవంత్ కు జూబ్లీహిల్స్ టెన్షన్

Exit mobile version