Gayatri Mantra:గాయత్రీ మంత్రాన్ని జపించండి ..సర్వ సమస్యలకూ పరిష్కారం అదేనట!

Gayatri Mantra: కేవలం రెండు నెలలలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి జీవితంలో పోగొట్టుకున్న ప్రశాంతత, ధైర్యం, గౌరవం తిరిగి వచ్చాయి.

Gayatri Mantra

ఒకానొక సందర్భంలో, మద్రాసులోని తేనంపేట్ ప్రాంతం నుంచి సుమారు నలభై మంది బ్రాహ్మణులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. వారు స్వామివారికి వినయంగా నమస్కరించి, తమ ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన సామాజిక సమస్యను విన్నవించారు. కొంతమంది నాస్తికవాదులు తమను చూసి గేలిచేస్తున్నారని, ధైర్యంగా తిరగడానికి కూడా సిగ్గుపడుతున్నామని వాపోయారు. తమ శిఖలు, యజ్ఞోపవితాలు, ఊర్ధ్వపుండ్రాలు వంటి ధార్మిక చిహ్నాలను చూసి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దానితో తమ మనస్సులో ప్రశాంతత కొరవడిందని వివరించారు.

వారి బాధాకరమైన మాటలన్నీ శ్రద్ధగా విన్న తర్వాత, స్వామివారు ఎలాంటి తొందరపాటు లేకుండా, అత్యంత ప్రశాంతంగా ఒకే ఒక ప్రశ్న అడిగారు.. మీరందరూ రోజూ గాయత్రీ(Gayatri Mantra) జపం చేస్తున్నారు కదా ఈ ప్రశ్నకు అక్కడున్నవారంతా మౌనంగా ఉండిపోయారు. వారి మౌనమే తాము జపం చేయడం లేదనే సమాధానమని గ్రహించిన పరమాచార్యులు, వారిపై ఏమాత్రం కోపం చూపకుండా, అత్యంత మృదువుగా ..ఇకమీద ప్రతిరోజూ క్రమం తప్పకుండా గాయత్రీ జపాన్ని కొనసాగించండి అంతా సర్దుకుంటుందని అన్నారు.

Gayatri Mantra

తర్వాత వారంతా మహాస్వామి ఆదేశాన్ని శిరసావహించారు. వెంటనే రోజూ గాయత్రీ (Gayatri Mantra)జపం చేయడం ప్రారంభించారు. కేవలం రెండు నెలలలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారి జీవితంలో పోగొట్టుకున్న ప్రశాంతత, ధైర్యం, గౌరవం తిరిగి వచ్చాయి. సమాజంలో వారిని గేలి చేసే ధోరణి తగ్గిపోయింది. వారు ఆనందంతో తిరిగి మహాస్వామి వద్దకు వెళ్లి, తమ జీవనంలో వచ్చిన అద్భుతమైన మార్పును వివరించారు. అప్పుడు పరమాచార్యులు స్నేహపూర్వకంగా నవ్వుతూ ..“మీకు కలిగిన కష్టాలకు కారణం మరొకటి కాదు, మీరు గాయత్రీ జపాన్ని వదిలేయడమే. గాయత్రీ మంత్రం యొక్క శక్తిని అంచనా వేయడం, లెక్కగట్టడం మానవమాత్రులకు సాధ్యం కాదని చెప్పారు.

“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రీ(Gayatri Mantra)ని వదిలేయడమే!” అని స్వామివారు స్పష్టం చేశారు. ఇది కేవలం ఆ బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన ఉపదేశం కాదు. మనందరికీ వర్తించే శాశ్వత సత్యం ఇది. శాస్త్రం చెప్పిన విధంగా మన ధర్మాన్ని, నిత్య కర్తవ్యాలను మనం నిబద్ధతతో పాటించినట్లయితే, ఎవరూ మనల్ని బాధపెట్టరు. ప్రతివాడు ప్రతివాడిని గౌరవించే, సమస్యలు లేని సమాజం వాటంతట అవే ఏర్పడతాయి. గాయత్రీ మంత్రం మనకు రక్షణగా, శక్తిగా నిలుస్తుందని ఈ సంఘటన ద్వారా పరమాచార్యులవారు లోకానికి తెలియజేశారు.

Cough syrup deaths: దగ్గు సిరప్‌తో చిన్నారుల మృతి ఘటన .. సీబీఐ విచారణ కోరుతూ పిల్

Exit mobile version