Dussehra :ఇంద్రకీలాద్రిపై దసరా శోభ..11 రోజుల పాటు దుర్గమ్మకు ఏ రోజు ఏ అలంకారం?

Dussehra: సాధారణంగా తొమ్మిది రోజులు జరిగే నవరాత్రులు, ఈసారి 10 రోజులు జరగనున్నాయి. అంటే విజయదశమితో కలిపి మొత్తం 11 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించే అద్భుత అవకాశం భక్తులకు లభించింది.

Dussehra

దేశమంతా దసరా (Dussehra)నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి పారవశ్యంతో ప్రతి ఆలయం కళకళలాడుతోంది. ఈ ఏడాది ఈ పండుగకు ఒక అరుదైన విశేషం తోడైంది. సాధారణంగా తొమ్మిది రోజులు జరిగే నవరాత్రులు, ఈసారి 10 రోజులు జరగనున్నాయి. అంటే విజయదశమితో కలిపి మొత్తం 11 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించే అద్భుత అవకాశం భక్తులకు లభించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, ఈ మహోత్సవాలకు వైభవంగా ముస్తాబైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ 11 రోజుల పండుగలో, కనకదుర్గమ్మ ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ఈవో శినా నాయక్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, తొలి రోజు బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చి, చివరి రోజు రాజరాజేశ్వరి దేవిగా భక్తులను ఆశీర్వదించనున్నారు.

Dussehra

ఈ ఉత్సవాలలో సెప్టెంబర్ 29న మూల నక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ ఒక ముఖ్య ఘట్టం. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాలు అక్టోబర్ 2న ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం, కృష్ణానదిలో అమ్మవారి హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉత్సవాలు కేవలం భక్తిని చాటుకోవడానికే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలవనున్నాయి. ఈ 11 రోజుల పండుగ భక్తులందరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం నింపాలని ఆశిద్దాం.

H-1B visa:హెచ్-1బీ వీసా ఫీజుపై క్లారిటీ..లక్ష డాలర్ల ఫీజు వారికి మాత్రమే

Exit mobile version