TTD :టీటీడీ ట్రస్ట్‌లకు రికార్డ్ స్థాయిలో విరాళాలు.. ఈ 11 నెలల్లో ఎంతంటే?

TTD : టీటీడీ నిర్వహణలో ఉన్న వివిధ ట్రస్ట్‌లకు రికార్డు స్థాయిలో విరాళాలు అందినట్లు అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి.

TTD

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహణలో ఉన్న వివిధ ట్రస్ట్‌లకు రికార్డు స్థాయిలో విరాళాలు అందినట్లు వెల్లడైంది. గత 11 నెలల స్వల్ప కాలంలో (2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు) మొత్తం రూ.918.6 కోట్లు విరాళాలుగా దక్కాయి. దాతలు టీటీడీపై చూపుతున్న అపారమైన విశ్వాసానికి, దేవస్థానం చేస్తున్న సామాజిక సేవలపై వారికి ఉన్న నమ్మకానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

టీటీడీకి విరాళాలు పెరగడం వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాతలు క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ట్రస్ట్‌లకు విరాళాలు మరింతగా వెల్లువెత్తాయి. దాతలకు తగిన గౌరవం, సదుపాయాలు కల్పించడంలో ఎక్కడా లోపం తలెత్తకూడదని చైర్మన్ ఇచ్చిన ఆదేశాలు, ట్రస్ట్‌ల నిర్వహణలో పారదర్శకత పట్ల భక్తులకు మరింత విశ్వాసాన్ని పెంచాయి. ఈ నిధులను కేవలం ట్రస్ట్‌ల కార్యకలాపాలకే కాకుండా, పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోలు , సాంకేతిక అభివృద్ధికి కూడా వినియోగించడంలో దాతలు సహకారం అందిస్తున్నారు.

విరాళాలు అందించడంలో భక్తులు లేటెస్ట్ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందిన మొత్తం రూ.918.6 కోట్లలో, అత్యధిక వాటా ఆన్‌లైన్ (Online) ద్వారానే సమర్పించబడింది.

TTD

టీటీడీ(TTD)కి అందిన విరాళాల్లో కొన్ని ముఖ్యమైన ట్రస్ట్‌లకు దక్కిన వాటా ఈ విధంగా ఉంది. ఈ వివరాలు దాతలు ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి.

ఈ గణాంకాలు చూస్తే, భక్తులు తమ విరాళాలను అన్నదానం, ఆరోగ్య సంరక్షణ (శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని, ప్రాణదాన ట్రస్ట్), శ్రీవాణి ద్వారా ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యకలాపాలకు అధికంగా సమర్పిస్తున్నారని స్పష్టమవుతోంది.

Rains: ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Exit mobile version