Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేట్‌చార్జ్..అభ్యర్థులకు ఈసీ షాక్!

Election: ఎన్నికల అధికారులు ప్రచారానికి అయ్యే ఖర్చులకు సంబంధించి ఒక వివరమైన ధరల పట్టికను (రేట్‌చార్జ్) విడుదల చేశారు.

Election

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికల (Election)సమయంలో, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల విషయంలో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఎన్నికల(Election) అధికారులు ప్రచారానికి అయ్యే ఖర్చులకు సంబంధించి ఒక వివరమైన ధరల పట్టికను (రేట్‌చార్జ్) విడుదల చేశారు.

ఉపఎన్నిక (Election)షెడ్యూల్

నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.అక్టోబర్ 13న నోటిఫికేషన్ రానుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా, బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.

నిజానికి, ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు కోట్లలో ఉన్నా కూడా, ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.40 లక్షలు మించకూడదు. అభ్యర్థులు తాము ఎంత ఖర్చు చేసినా, అధికారిక లెక్కలు మాత్రం ఈ పరిమితి లోబడే ఉండాలి. అందుకే, ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.

Election

ప్రచారం ఖర్చుల రేట్‌చార్జ్ వివరాలు..ఈసీ విడుదల చేసిన రేట్‌చార్ట్‌లో ప్రచారానికి ఉపయోగించే ప్రతి వస్తువు, సేవకు ధరలను నిర్ణయించారు. ఇది అభ్యర్థులు తమ ఖర్చులను లెక్క చూపడానికి ప్రామాణికంగా పనిచేస్తుంది.

వస్తువు/సేవ యూనిట్ నిర్ణీత ధర (రూ.)

వీటితో పాటు, సౌండ్ బాక్సులు, కుర్చీలు, పేపర్ ప్లేట్లు, టీషర్టులు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు వంటి ప్రచార సామగ్రికి కూడా ఈసీ ప్రత్యేక ధరలను నిర్ణయించింది. ఈ నిబంధనలు అభ్యర్థులు చేసే ఖర్చులో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినవి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version