Dhurandhar:రెండు ఓటీటీలలో ధురంధర్.. ఫ్యాన్స్ కోసం స్పెషల్ సర్ప్రైజ్ కూడా రెడీ

Dhurandhar: గతేడాది డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ మూవీ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కురిపించి.. ఏకంగా 1300 కోట్ల రూపాయల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Dhurandhar

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో.. వచ్చిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్. గతేడాది డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కురిపించి.. ఏకంగా 1300 కోట్ల రూపాయల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో దీనికి కంటిన్యూగా ధురంధర్ ది రివేంజ్ పేరుతో సీక్వెల్‌ను కూడా ఆడియన్స్‌ ముందుకు తెచ్చారు. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన ఈ రెండో భాగం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ .. ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ ఇండియన్ మూవీ లిస్టులో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది.

కాగా ఇప్పుడు ఓటీటీ ప్రియుల కోసం ఈ మూవీ యూనిట్ ఊహించని ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అనౌన్స్ చేసింది. ధురంధర్ మొదటి భాగానికి సంబంధించిన అన్‌కట్ వెర్షన్‌ను అంటే థియేటర్లలో కట్ చేసిన సీన్లతో కలిపి.. డిజిటల్ వేదికలపైకి తీసుకువస్తున్నారు. ఒకే రోజు రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మే 22 నుంచి ఈ అన్‌కట్ వెర్షన్ అందుబాటులోకి వస్తున్నట్లు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు అధికారికంగా ప్రకటించాయి. సుమారు 3 గంటల 52 నిమిషాల డ్యురేషన్‌తో ఈ ఫస్ట్ భాగం అలరించబోతోంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగుపెట్టేస్తుందన్న మాట.

ఇక మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ధురంధర్ సీక్వెల్ ఇండియా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4వ తేదీ రాత్రి 7 గంటల నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ఈ మూవీ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ మూవీ అందుబాటులోకి రాబోతోంది.

Dhurandhar

అయితే విదేశాల్లో ఉన్న ఆడియన్స్ కోసం మాత్రం ఇప్పటికే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన వెర్షన్ కంటే కూడా ఓటీటీ వెర్షన్‌లో ఆడియన్స్‌కు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ పంచేలా కొన్ని సరికొత్త సన్నివేశాలను యాడ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొత్తంగా థియేటర్లలో ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉండగా, ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే వెర్షన్ 3 గంటల 52 నిమిషాల డ్యురేషన్‌తో రాబోతోంది.

అలాగే సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ యాక్షన్ మూవీలో.. ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లాంటి దిగ్గజ యాక్టర్స్ కీలక పాత్రలను పోషించారు.

Eggs :గుడ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? రోజుకు ఎన్ని ఎగ్స్ తినాలి?

Exit mobile version