Just Andhra PradeshLatest News

Rains: మరో అల్పపీడనం ముప్పు.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు!

Rains: ఆగస్టు 25 నాటికి వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగానే ఏపీకి వర్ష సూచనలు జారీ అయ్యాయి.

Rains

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అల్పపీడనం వల్ల ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోందో ఇక్కడ చూద్దాం.

అమరావతి వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, ఆగస్టు 25 నాటికి వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగానే ఏపీకి వర్ష సూచనలు జారీ అయ్యాయి.

మరోవైపు, ఆగస్టు 23న గంగా పరీవాహక ప్రాంతంలో ఏర్పడిన మరో అల్పపీడనం అదే చోట కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి, రాబోయే 24 గంటల్లో జార్ఖండ్ వైపు బలహీనపడి కదిలే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలో నైరుతి-పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయి.

ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీద నైరుతి-పశ్చిమ గాలులు వీస్తున్నాయి.

Rains
Rains

ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. అంతేకాకుండా, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, బలమైన గాలుల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల(Rains) వల్ల పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button