Symptoms
శీతాకాలం వచ్చేసింది కాబట్టి, ప్రజల ఆహారపు అలవాట్లు మారడం సహజం. అయితే, ఈ పరిస్థితుల్లో మధుమేహ (డయాబెటిక్) రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల శరీర జీవక్రియ రేటు మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. చలిలో ప్రజలు తక్కువ వ్యాయామం చేయడం, బయటకు వెళ్లకపోవడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు అమాంతంగా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో ఇన్సులిన్ అవసరాలు , శరీర ప్రతిస్పందన మారడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు పుష్కలంగా తినాలి. అధిక స్వీట్లు లేదా వేయించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
వాతావరణం చల్లగా ఉన్నా కూడా, ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. మీరు బయటకు వెళ్లలేకపోతే, ఇంట్లోనే యోగా లేదా ధ్యానం చేయండి.
డయాబెటిస్ రోగులు తమ చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం మంచిది. మీ చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నిర్లక్ష్యం చేయడం కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు.
శ్రద్ధ వహించాల్సిన లక్షణాలు(Symptoms):
- ఒక వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు (Symptoms)కనిపిస్తే, అవి చక్కెర స్థాయి ఎక్కువగా ఉందని సూచించే సంకేతాలు కావచ్చు:
- తరచుగా మూత్ర విసర్జన,అధిక దాహం, ఆకస్మిక బరువు తగ్గడం లేదా పెరగడం
ఈ లక్షణాలు(Symptoms) కనిపిస్తే, ముందుగా రక్త చక్కెర పరీక్ష చేయించుకోవాలి. అది ఎక్కువగా ఉంటే, కొన్ని నెలలుగా మీ చక్కెర స్థాయిలను వెల్లడించే HbA1c పరీక్ష చేయించుకోవడం మంచిది. దీని ఆధారంగా వైద్యులు తగిన చికిత్సను అందిస్తారు. డయాబెటిస్తో పాటు రక్తపోటు ఉంటే, మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే, ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం.
