Rains
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఈరోజు (అక్టోబర్ 21, మంగళవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తదుపరి 24 గంటలలో పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండం (Depression) గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం(Rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఈ రోజు (మంగళవారం), రేపు (బుధవారం) తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇక గురు, శుక్రవారాల్లో హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు (Rains)కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హనుకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నైరుతి రుతుపవనాలు వెళ్లినా కూడా ఈశాన్య రుతుపవనాల రాక, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి వరుసగా 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావొద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు.