Suvendu
దీంతో ఎన్నికల్లో గెలిస్తే గ్యాంగ్ స్టర్స్ లేకుండా చేస్తామనీ బీజేపీ పదేపదే ప్రచారం చేసింది. దానికి తగ్గట్టుగానే ప్రజల నుంచి గట్టి స్పందనే లభించడం, ఎన్నికల్లో డబుల్ సెంచరీ సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో రెండోరోజు నుంచే సువేందు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తప్పు చేసిన ఏ గ్యాంగ్ స్టర్ ను వదిలిపెట్టకుండా జైల్లో పడేయమని స్పష్టం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్స్ పై ఫోకస్ పెట్టి వరుసగా అరెస్ట్ చేశారు.
పైగా అందరికీ తెలిసేలా హౌరా బ్రిడ్జిపై నడిపించుకు తీసుకెళ్లిన పోలీసులు ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు. అయితే యూపీ తరహా పాలనను బెంగాల్ లో బలవంతంగా రుద్దుతున్నారంటూ విపక్ష టీఏంసీ ఆరోపిస్తోంది. కానీ ప్రజలు మాత్రం గ్యాంగ్ స్టర్స్ నుంచి విముక్తి కోరుకోవడంతో బీజేపీ చర్యలకే మద్దతుగా నిలుస్తున్నారు. ఒకవేళ మహిళలపై అఘాయిత్యాలు, హత్య వంటి వాటికి పాల్పడితే ఎన్ కౌంటర్ చేసేందుకు కూడా వెనుకాడొద్దని పోలీసులకు సువేందు స్పష్టం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
Pawan Kalyan :సహనానికి హద్దులు దాటితే తాట తీస్తాం..పవన్ వార్నింగ్పై రాజకీయ విశ్లేషకుల అంచనా
