Just Lifestyle

Fenugreek : మీకిది తెలుసా..? మెంతులతో మెరిసిపోవచ్చట..

Fenugreek : కొన్ని సహజ పదార్థాలతో మెంతులను కలిపి వాడితే, ఎన్నో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Fenugreek: వంటల్లో రుచికి వాడే మెంతులు కేవలం వంటగదికే పరిమితం కాదని మీకు తెలుసా? ఇవి మన చర్మ సౌందర్యానికి (Skin care)కూడా అద్భుతంగా పనిచేస్తాయట. కొన్ని సహజ పదార్థాలతో మెంతులను కలిపి వాడితే, ఎన్నో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Fenugreek

వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు(Wrinkle), మొటిమల మచ్చలు చాలా మందిని బాధిస్తుంటాయి. ఈ సమస్యకు మెంతులు( Fenugreek) చక్కటి పరిష్కారం. రెండు చెంచాల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో ఒక చెంచా మొక్కజొన్న పిండి కలిపి, మిశ్రమం చిక్కబడే వరకు వేడి చేయాలి. చల్లారిన తర్వాత, ఈ మిశ్రమంలో ఒక చెంచా కలబంద గుజ్జు, కొద్దిగా బాదం నూనె, విటమిన్ ఈ నూనె కలపాలి. ఈ క్రీమ్‌ను రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. ఇది వయసును అడ్డుకునే పవర్ ఫుల్ క్రీమ్‌(Anti-aging cream)లా పనిచేసి, ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. మెంతులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి, మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని జల్లెడ పట్టి, ఒక చెంచా పొడిలో ఒక చెంచా పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాదు, ఇది ఒక సహజసిద్ధమైన శుభ్రపరిచే పదార్థంలా పనిచేసి, చర్మంలోని మురికిని బయటకు పంపుతుంది. మెంతులను నానబెట్టిన నీటిలో దూదిని ముంచి, చర్మంపై మర్దనా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మ రంధ్రాల్లోని జిడ్డును దూరం చేసి, మొటిమలు రాకుండా సహాయపడుతుంది.

నిస్తేజంగా కనిపించే చర్మానికి మెరుపు తీసుకురావడానికి మెంతులు ఉపయోగపడతాయి. అరకప్పు నీటిలో రెండు చెంచాల మెంతులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి, ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ముఖానికి తేమను అందించే క్రీమ్ రాసిన తర్వాత ఈ నీటిని స్ప్రే చేసుకుంటే, అది సహజసిద్ధమైన చర్మ టోనర్‌లా పనిచేసి ముఖానికి మెరుపునిస్తుంది. అలాగే, నానబెట్టిన మెంతులను పేస్ట్‌లా చేసి, ముఖంపై సున్నితంగా రుద్దుకుంటే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

పొడిబారిన చర్మానికి తేమ అందించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. రెండు చెంచాల మెంతులను ఆరు లేదా ఏడు గంటలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో రెండు చెంచాల పెరుగు మరియు ఒక చెంచా తేనె కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాలు ఆరనిచ్చి, తర్వాత కడిగేయాలి. ఇది చర్మానికి అవసరమైన తేమను అందించి, పొడిబారిపోకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు ముఖంపై చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతులు మీ సౌందర్య సంరక్షణలో ఒక కొత్త ఆయుధంగా మారతాయి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button