Just Andhra PradeshJust PoliticalLatest News

Vizag Metro :విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ప్రాజెక్ట్ వివరాలు ఏంటి?

Vizag Metro :విశాఖ మెట్రో .. విశాఖకే కాకుండా, విజయవాడ మెట్రోతో పాటు ఏపీవ్యాప్తంగా అర్బన్ మొబిలిటీకి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు.

Vizag Metro

ఏపీ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్( Vizag Metro ) ప్రాజెక్టుకు మోదీ ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో విశాఖ మెట్రోకు సంబంధించిన రివైజ్డ్ డీపీఆర్ (Revised DPR) కు అప్రూవల్ లభించింది. ఇది కేవలం విశాఖకే కాకుండా, విజయవాడ మెట్రోతో పాటు ఏపీవ్యాప్తంగా అర్బన్ మొబిలిటీకి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు.

ప్రాజెక్టు వివరాలు: ఫేజ్-1 (Phase-I)

మొదటి విడతలో మొత్తం 46.23 కి.మీటర్ల వరకూ మెట్రో నెట్‌వర్క్ నిర్మించనున్నారు. దీని కోసం సుమారు 99.75 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు, దీని ఖరీదు సుమారు 882 కోట్ల రూపాయలు.

కారిడార్ – 1.. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు. ఈ మార్గం 34.40 కి.మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో మొత్తం 32 స్టేషన్లు ఉంటాయి. దీని వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, గాజువాక పారిశ్రామిక ప్రాంత కార్మికులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.

కారిడార్ – 2.. గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు. ఈ మార్గం 5.08 కి.మీటర్ల పొడవుతో 6 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఇది సిటీ కేంద్రం, షాపింగ్ ఏరియాలు , రైల్వే స్టేషన్‌ను కలుపుతుంది.

కారిడార్ – 3.. తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తైర్ వరకు. ఈ మార్గం 6.75 కి.మీటర్ల పొడవుతో 4 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులను కవర్ చేస్తుంది.

Vizag Metro Rail
Vizag Metro Rail

ఫేజ్-2 (Phase-II)

రెండో విడతలో భాగంగా మెట్రోను కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 30.67 కి.మీటర్ల వరకూ విస్తరిస్తారు. ఇందులో అదనంగా 10 స్టేషన్లు వస్తాయి. మొత్తంగా విశాఖ మెట్రో నెట్‌వర్క్ 76.90 కిలోమీటర్లకు చేరుకుంటుంది.

ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ రూ. 25,807 కోట్లు. దీనిలో ఫేజ్-1 కు రూ. 11,498 కోట్లు, ఫేజ్-2 కు రూ. 14,309 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ ప్రాజెక్టు పీపీపీ (PPP) మోడల్‌లో సాగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 40 శాతం (4,600 కోట్లు), ఏపీ ప్రభుత్వం 20 శాతం (2,300 కోట్లు), ప్రైవేట్ భాగస్వాములు 40 శాతం (4,600 కోట్లు) నిధులు సమకూరుస్తారు. అలాగే అదనంగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ కోసం కూడా ప్రత్యేక నిధులు సాధించారు.

నిర్మాణ టైమ్‌లైన్

ఫిబ్రవరి 2026.. డీపీఆర్ ఆమోదం (పూర్తయింది)
మార్చి-ఏప్రిల్ 2026.. టెండర్ల ప్రక్రియ
జూన్ 2026.. నిర్మాణ పనుల ప్రారంభం
డిసెంబర్ 2030.. ఫేజ్-1 పనుల పూర్తి
2032… పూర్తి స్థాయిలో మెట్రో కార్యకలాపాలు

Vizag Metro Rail
Vizag Metro Rail

ఈ మెట్రోలో డ్రైవర్ లేని రైళ్లను (Driverless trains) ప్రవేశపెడుతుండటం విశేషం. అత్యాధునిక ఏసీ కోచ్‌లతో పాటు ఎలివేటెడ్ , అండర్ గ్రౌండ్ స్టేషన్ల మిశ్రమంగా ఇది ఉంటుంది. దాదాపు 25 రైళ్లు (3-కోచ్ ఏసీ, 900 మంది సామర్థ్యం) అందుబాటులోకి వస్తాయి. సముద్ర మట్టం సవాళ్లను తట్టుకునేలా 1,200 మీటర్ల ఎలివేషన్ డిజైన్ చేశారు.

విశాఖ జనాభా 20 లక్షలు దాటడంతో, రోజుకు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారని భావిస్తున్నారు. ప్రయాణ సమయం 60 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుంది. దీనివల్ల జీడీపీ (GDP) 2-3 శాతం పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే 20,000 మందికి నిర్మాణ సమయంలో, 5,000 మందికి శాశ్వతంగా ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే కాలుష్యం 30 శాతం వరకు తగ్గుతుంది.

మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ డిప్లమసీ వల్ల విశాఖ మెట్రో( Vizag Metro ) పట్టాలెక్కబోతోంది. విశాఖను ఐటీ ,పోర్ట్ హబ్‌గా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ మెట్రో లాగే విశాఖ మెట్రో(( Vizag Metro ) )కూడా తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వెన్నెముకగా నిలుస్తుందని విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button