Just NationalLatest News

India: ఉగ్రవాద కనెక్షన్‌లను నియంత్రించేందుకు భారత్ కొత్త వ్యూహం

India:అఫ్గాన్ భూభాగాన్ని భారత్-వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా నిఘాను పెంచడానికి అవకాశం లభిస్తుంది.

India

భారతదేశం (India)ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం, తాలిబాన్‌తో దౌత్య సంబంధాలను పునఃప్రారంభించే దిశగా ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో చర్చలు జరపడం, అధికారిక విందులో పాల్గొనడంతో పాటు సహకార సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

భారత్‌(India)కు ఉన్న ప్రధాన ప్రయోజనాలు..ఆఫ్ఘనిస్తాన్‌లో తిష్ట వేసిన పాకిస్తాన్ అనుకూల ముఠాలు మరియు ISI కార్యకలాపాలను, ఉగ్రవాద సంబంధాలను నియంత్రించడంలో ఈ దౌత్య మార్పు భారత్‌కు సహాయపడుతుంది. ముఖ్యంగా, అఫ్గాన్ భూభాగాన్ని భారత్-వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా నిఘాను పెంచడానికి అవకాశం లభిస్తుంది.

ఆర్థిక మరియు వాణిజ్య ప్రయోజనాలు..ఖనిజాలు (Mineral),ఇంధన వనరులను (Energy Resources) పొందడం. నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ ద్వారా వాణిజ్య ప్రయోజనాలు. అఫ్గాన్ మార్కెట్‌లోకి భారతీయ కంపెనీల విక్రయాలు, పెట్టుబడులను (ముఖ్యంగా లిథియం వంటి కీలక ఖనిజాల తవ్వకాలు) పెంచేందుకు ఆహ్వానం.

India
India

సామాజిక, మానవ హక్కుల వాదన.. తాలిబాన్‌తో నేరుగా చర్చించడం ద్వారా మానవ హక్కులు, మహిళా విద్య, శరణార్థుల సమస్యల వంటి సున్నితమైన అంశాలలో భారత్ తన వాదనను బలంగా వినిపించే అవకాశం లభిస్తుంది.

రష్యా, చైనా, ఇరాన్: ఈ దేశాలు తాలిబాన్ పాలనతో ఇప్పటికే దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. భారత్ కూడా ఈ వరుసలో చేరడం వల్ల “ఆసియా రాజకీయ డైనమిక్స్”లో (Asian Political Dynamics) గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ఈ సంస్థలు మానవ హక్కులు, మహిళల విద్య, స్వేచ్ఛలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ, తాలిబాన్ పాలనలో మానవతా సంక్షేమాన్ని నిర్వహించాలని అభిప్రాయపడుతున్నాయి.

అమెరికా ప్రభుత్వానికి తాలిబాన్ వ్యవహారం కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా.. అధికారికంగా ఈ విధంగా స్పందించింది.. భారత్ తన భద్రత, వాణిజ్య ప్రయోజనాల కోసం చర్చల మార్గాన్ని ఎంచుకోవడం అర్థవంతమేనని చెప్పింది. అయితే తాలిబాన్ పాలన మానవ హక్కులను గౌరవించాలి. మేము భారత ప్రయత్నాన్ని గౌరవిస్తాం, కానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు తావు ఇవ్వడానికి వీలు లేదని చెప్పింది. అమెరికా, భారత్-తాలిబాన్ సంబంధాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేయడమే కీలకం అని స్పష్టం చేసింది.

ఈ పరిణామం ద్వారా ఎవరికి లాభం అంటే..

  • భారత్.. భద్రతా విభాగం మరియు ఆర్థిక ప్రయోజనాలు సాధించడంలో ముందడుగు వేసింది.
  • తాలిబాన్.. అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక సహాయం మరియు మెరుగైన దౌత్య అవకాశాలు.
  • అఫ్గాన్ ప్రజలు.. బహుళ దేశాల సహకారాలతో మౌలిక వసతులు మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపడవచ్చు.
  • ప్రస్తుతం ఈ పరిణామం “నిశిత పరిశీలన దౌత్యం” (Watchful Diplomacy) దశలో కొనసాగుతోంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button