Garuda Purana:గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ? అది అమంగళమా? శుభప్రదమా?
Garuda Purana :ఎవరైనా మరణించినప్పుడే గరుడ పురాణం చదవాలని.. మామూలు సమయాల్లో ఇంట్లో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటారు.
Garuda Purana
హిందూ మతంలోని అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం (Garuda Purana )ఒకటిగా పండితులు చెబుతారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి జీవన్మరణాల రహస్యాలను ఉపదేశించిన గ్రంథమని అంటారు. అయితే, గరుడ పురాణం గురించి ప్రజల్లో చాలా భయాలు , అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడే ఈ పురాణం చదవాలని.. మామూలు సమయాల్లో ఇంట్లో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటారు.
గరుడ పురాణం (Garuda Purana ) ఇంట్లో ఉంటే అమంగళం జరుగుతుందని, అరిష్టం అని ప్రచారం కూడా ఉంది. కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే అని పండితులు చెబుతున్నారు. ఏ పురాణమైనా దేవుడి వాక్కు కాబట్టి అది ఎప్పుడూ శుభప్రదమే అవుతుందని పండితులు అంటున్నారు.
గరుడ పురాణం(Garuda Purana )లో మూడు భాగాలు ఉంటాయి. అవి..ఆచార కాండ, ప్రేత కాండ , బ్రహ్మ కాండ. దీనిలో ప్రేత కాండలో మాత్రమే మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, నరక బాధలు, పిండ ప్రదానాల గురించి ఉంటుంది. అందుకే దీనిని ఎవరైనా చనిపోయినప్పుడు పారాయణం చేస్తారు. కానీ మిగిలిన రెండు భాగాలలో ధర్మం, నీతి, ఆరోగ్యం, ఆయుర్వేదం , మోక్షం గురించి అద్భుతమైన ఎన్నో విషయాలు ఉంటాయి.
గరుడ పురాణం చదవడం వల్ల నిజానికి మనిషికి పాపభీతి కలుగుతుంది. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలియడం వల్ల ఆ మనిషి సన్మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాడు. ఇతరులకు అన్యాయం చేయకూడదనే స్పృహను ఈ గ్రంథం కలిగిస్తుంది. కాబట్టి గరుడ పురాణం భయం కలిగించే గ్రంథం కాదు, ఒక క్రమశిక్షణను నేర్పే గ్రంథం అని అందరూ తెలుసుకోవాలి.

గరుడ పురాణం (Garuda Purana)ఇంట్లో ఉంచుకోవచ్చు అలాగే పవిత్రమైన మనసుతో ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఏ గ్రంథమైనా అందులోని జ్ఞానాన్ని తెలుసుకోవడానికే రాశారు కానీ, భయపడటానికి కాదు. అంతేకాదు గరుడ పురాణం చదవడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని కూడా చెబుతారు. అయితే, ఏ పూజ చేసినా లేదా పురాణం చదివినా భక్తిశ్రద్ధలతో చేయడం ముఖ్యం.
అందులోని నీతిని గ్రహించి జీవితంలో ఆచరిస్తే, జీవించి ఉన్నప్పుడే మోక్షానికి మార్గం సుగమం అవుతుంది. మరణం అనేది జీవితంలో ఒక అంతర్భాగం అని, అది అంతం కాదని తెలియజేయడమే ఈ గరుడ పురాణం ఉద్దేశ్యం. కాబట్టి అపోహలను పక్కన పెట్టి, సత్యమైన జ్ఞానాన్ని అందించే గరుడ పురాణాన్ని
ఇంట్లో ఉంచుకుని పఠనం చేసుకోవచ్చు.
APSRTC:ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయం..




2 Comments