Mini-Auction: మినీవేలంలో గ్రీన్ జాక్ పాట్ ..పతిరణ, లివింగ్ స్టోన్కు భారీ ధర
Mini-Auction: అత్యధిక మనీ పర్స్ ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడగా.. మధ్యలో చెన్నై కూడా రేసులోకి వచ్చింది.
Mini-Auction
ఐపీఎల్ వేలం(Mini-Auction)లో ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా మ్యాచ్ లు గెలిపించే నత్తా ఉన్న ప్లేయర్స్ పై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. అంతా ఊహించినట్టుగానే కామెరూన్ గ్రీన్ రికార్డు ధర పలికాడు. ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడిన వేళ గ్రీన్ జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ.25.20 కోట్లకు అమ్ముడయ్యాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని రికార్డు ధరకు కోల్ కత్తా దక్కించుకుంది.
ఐపీఎల్ వేలం(Mini-Auction)లో గ్రీన్ కోసం గట్టి పోటీ నడిచింది. అత్యధిక మనీ పర్స్ ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడగా.. మధ్యలో చెన్నై కూడా రేసులోకి వచ్చింది. అయితే ప్రధాన పోటీ మాత్రం కేకేఆర్, సీఎస్కేల మధ్యనే నడిచింది. రెండు ఫ్రాంచైజీలు ఈ ఆసీన్ ఆల్ రౌండర్ ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడడంతో బిడ్డింగ్ పెరుగుతూ పోయింది. చివరికి రూ.25 కోట్ల దగ్గర చెన్నై ఆగిపోవడంతో కేకేఆర్ దక్కించుకుంది. దీంతో గ్రీన్ ఐపీఎల్ వేలం(Mini-Auction)లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ రికార్డ్ సృష్టించాడు.
గతంలో మిచెల్ స్టార్క్ ను కోల్కతానే రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును గ్రీన్ బ్రేక్ చేశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గానూ నిలిచాడు. ఇదిలా ఉంటే గ్రీన్ తర్వాత అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ గా పేసర్ మహేశ్ పతిరణ రెండో స్థానంలో నిలిచాడు.

చెన్నై రిలీజ్ చేసిన పతిరణ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. పతిరణ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీవడినా చివర్లో తప్పుకుంది. దీంతో కేకేఆర్ రూ.18 కోట్లకు అతన్ని దక్కించుకుంది. చెన్నై జట్టుతో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన వతిరణ తొలిసారి కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.
ఇక పతిరణ తర్వాత లివింగ్ స్టోన్ అత్యధిక ధర పలికాడు. తొలి రౌండ్లలో అమ్ముడుపోని లివింగ్ స్టోన్ యాక్సి లేరేటెడ్ రౌండ్ లో జాక్ పాట్ కొట్టాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన లివింగ్టన్ కోసం లక్నో, సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు పోటీ వడ్డాయి. చివరికి మనీ పర్స్ సరిపోకపోవడంతో లక్నో తప్పుకోగా.. లివింగ్ స్టోన్ ను సన్ రైజర్స్ రూ.13 కోట్లకు దక్కించుకుంది.
జోస్ ఇంగ్లీన్ ను లక్నో రూ.8.60 కోట్లకు దక్కించుకోగా.. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాన్సన్ హోల్డర్ కూడా జాక్ పాట్ కొట్టాడు హోల్డర్ ను గుజరాత్ టైటాన్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో మిల్లర్ రూ.2 కోట్లు (ఢిల్లీ), బెన్ డకెట్ రూ.2 కోట్లు (ఢిల్లీ), హనరంగా రూ.2 కోట్లు(లక్నో), డికాక్ రూ.2 కోట్లు (ముంబై), ఫిన్ అలెన్ రూ. 2 కోట్లు (కేకేఆర్), జాకబ్ డఫ్సీ రూ.2 కోట్లకు (ఆర్సీబీ) అమ్ముడయ్యారు.
మరోవైపు గత మెగా వేలంలో రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ ఈ సారి కేవలం రూ.7 కోట్లకే ఆర్సీబీకి అమ్ముడయ్యాడు. అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను రూ.7.20 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. తొలిరౌండ్లలో అమ్ముడుపోని రాహుల్ చాహర్ ఊహించని విధంగా చివర్లో రూ.5.20 కోట్ల ధర పలికాడు. ఆకాశ్ దీప్ కోటి రూపాయలకే కేకేఆర్ సొంతమయ్యాడు. ఇదిలా ఉంటే వృథ్వీ షా ఎట్టకేలకు వేలంలో అమ్ముడయ్యాడు. తొలి రౌండ్లలో అన్ సోల్డ్ గా మిగిలిన పృథ్వీ షాను యాక్సిలిరేటెడ్ రౌండ్లో రూ.75 లక్షల కనీన ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.



