Just TelanganaLatest News

Surekha’s reaction:ఆ వార్తలు అవాస్తవం.. కేటీఆర్ పరువు నష్టం కేసుపై మంత్రి కొండా సురేఖ రియాక్షన్

Surekha's reaction:మంత్రి గైర్హాజరు కావడంతో.. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసిందంటూ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

Surekha’s reaction

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా (Defamation Case) కేసులో తనపై జరుగుతున్న ప్రచారాన్ని (Campaign) తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు(Surekha’s reaction). తనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant) జారీ చేసినట్లుగా కొన్ని పత్రికలు, ఛానెళ్లు, వెబ్ సైట్లలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం (Completely False) అని ఆమె గురువారం స్పష్టం చేశారు.

గతంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Surekha’s reaction), మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శల సందర్భంగా ఆమె హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకుల (Divorce) అంశంపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

తనపై నిరాధారమైన ఆరోపణలు, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇదే వ్యాఖ్యలపై హీరో నాగార్జున అక్కినేని కూడా వేరుగా పరువు నష్టం దావా వేశారు.

Surekha's reaction
Surekha’s reaction

నాగార్జున వేసిన కేసు విషయంలో మంత్రి కొండా సురేఖ ఇటీవల స్పందించారు. తన వ్యాఖ్యలు ఎటువంటి దురుద్దేశ్యంతో (No Malicious Intention) చేసినవి కావని వివరణ ఇచ్చి, ఆయనకు క్షమాపణలు (Apology) చెప్పారు. దాంతో, నాగార్జున నాంపల్లి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు (Withdrawn). దీంతో వారిద్దరి మధ్య వివాదం ముగిసింది. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా మాత్రం విచారణ కొనసాగుతోంది.

దీంతోనే గురువారం నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు (Absent). దీంతో కోర్టు ఈ కేసును 2026, ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది.

మంత్రి గైర్హాజరు కావడంతో.. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసిందంటూ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రచారంపై స్పందించిన కొండా సురేఖ: “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందనే వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన ఉంది. ఆ రోజు విచారణకు హాజరు కావాలని మాత్రమే కోర్టు నాకు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మీడియా అంతా పరిగణలోకి తీసుకోవాలి,” అని ఆమె విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button