Just BusinessJust NationalLatest News

Gold buyers: బంగారం కొనేవారికి శుభవార్త..మరి వెండి పరుగులు తీసిందా? డౌన్ అయిందా?

Gold buyers: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో పసిడి కొనుగోలుదారులకు ఈరోజు కొంత ఉపశమనం లభించింది.

Gold buyers

దేశీయ బులియన్ మార్కెట్‌లో నేడు (గురువారం) పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాల కారణంగా, దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొంత దిద్దుబాటుకు లోనయ్యాయి. ముఖ్యంగా, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల విధానాలు, డాలర్ విలువలో మార్పులు పసిడి కదలికలను ప్రభావితం చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో పసిడి కొనుగోలుదారుల(gold buyers)కు ఈరోజు కొంత ఉపశమనం లభించింది.

Gold buyers
Gold buyers
  • 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ. 220 తగ్గి, నేడు రూ. 1,30,360 వద్ద స్థిరపడింది.
  • 22 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 1,19,500గా నమోదైంది.
  • 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 160 తగ్గి రూ. 97,780కి చేరుకుంది.

ఈ తగ్గింపు ధరలు, పండుగలు లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకునే (Gold buyers)వారికి కాస్త ఊరటనిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో తగ్గినట్లే, దేశ రాజధాని ఢిల్లీ మరియు ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పసిడి ధరలు దాదాపు అదే స్థాయిలో దిద్దుబాటును చూపాయి.

న్యూ ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 220 తగ్గి రూ. 1,30,510గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ. 200 తగ్గి రూ. 1,19,650గా ఉంది. ఢిల్లీలో ధరలు తెలుగు రాష్ట్రాల కంటే స్వల్పంగా ఎక్కువగా ఉండటం గమనార్హం.

ముంబై మార్కెట్‌లో ధరలు తెలుగు రాష్ట్రాల మాదిరిగానే ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 220 తగ్గి రూ. 1,30,360గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ. 200 తగ్గి రూ. 1,19,500గా ఉంది.

Gold buyers
Gold buyers

బంగారం ధరలు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టినా, వెండి మార్కెట్‌లో విభిన్న ధోరణి(Gold buyers) కనిపించింది.హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 1,000 తగ్గి, నేడు రూ. 2,00,000గా ఉంది. పారిశ్రామిక లోహాల డిమాండ్లలో మార్పుల కారణంగా ఈ తగ్గింపు సంభవించింది.

ఢిల్లీ, ముంబైలో వెండి .. దీనికి విరుద్ధంగా, ఢిల్లీ ,ముంబై నగరాల్లో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,91,000 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత మార్కెట్ హెచ్చుతగ్గులు స్వల్పకాలికమే కావచ్చని, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భయాలు పూర్తిగా తొలగిపోకపోతే, రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button