Just Entertainment

Mahesh : మహేష్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్

Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగలాంటి వార్త వచ్చేసింది.

Mahesh :సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగలాంటి వార్త వచ్చేసింది. వారి ఫేవరెట్ స్టార్ పుట్టినరోజు(birthday) సందర్భంగా, ఒక ఆల్-టైమ్ క్లాసిక్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. అంతేకాదు, మ్యూజిక్ లవర్స్ కోసం మరో అదిరిపోయే సర్‌ప్రైజ్(surprise) ఎదురు చూస్తోంది.

Mahesh Athadu

సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘అతడు’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. మహేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ‘ఖలేజా’ రీ-రిలీజ్‌కు మహేష్(Mahesh) అభిమానులు చూపిన ఉత్సాహం చూశాక, ఈ ప్రకటన వారికి ఎక్స్‌ట్రా కిక్ ఇచ్చింది.

మహేష్ బాబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ‘అతడు’ మూవీ 2005 ఆగస్టు 10న రిలీజయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పన్స్ వచ్చింది. థియేటర్లకే కాదు, టెలివిజన్‌లోనూ ఈ మూవీకి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యింది. మూవీ లవర్స్‌ల ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది.

అతడు(Athadu) 2025 ఆగస్టు 10 నాటికి థియేటర్లలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా, సినిమాను 2025 ఆగస్టు 09న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడం ఈ సెలబ్రేషన్స్‌కు మరింత గ్లామర్ అద్దనుంది. ఈ డబుల్ ట్రీట్

మహేష్ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన అతడు సినిమాను 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 4K రిజల్యూషన్, డాల్బీ డిజిటల్ ఆడియోతో రీ-రిలీజ్ చేస్తున్నారు. అప్‌గ్రేడెడ్ క్వాలిటీతోబ్లాక్‌బస్టర్‌ను మళ్లీ బిగ్‌స్క్రీన్‌పై చూడటం మహేష్ ఫ్యాన్స్‌కు ఒక అపురూపమైన ఎక్స్‌పీరియన్స్ కానుంది.

అభిమానులకు రెండో స్పెషల్ గిఫ్ట్ మణిశర్మ అద్భుతమైన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) ఇప్పుడు అధికారికంగా విడుదలైంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతంసినిమాకు ఒక అదనపు ఆకర్షణ అన్నది అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లుగా అభిమానులు పూర్తి OST కోసం ఎదురుచూస్తున్నారు. ఆ కల ఇప్పుడు నిజమైంది!

20 ఒరిజినల్ ట్రాక్‌లతో కూడినపూర్తి OST ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొద్ది గంటల్లోనేOST సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్ దీనిపై నాన్‌స్టాప్‌గా పోస్టులు పెడుతూ, #Athadu4K, #AthaduOST వంటి హ్యాష్‌ట్యాగ్‌లను వైరల్ చేస్తున్నారు.

మహేష్ బాబుతో పాటు త్రిష హీరోయిన్‌గా నటించినచిత్రంలో నాజర్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, సోనుసూద్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డి. కిషోర్ అండ్ రామ్మోహన్ ఎం నిర్మించినసినిమాను, కొత్త తరానికి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లో మళ్లీఅతడుచూసే గోల్డెన్ ఛాన్స్ దొరకనుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫెస్ట్ కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button