Just Andhra PradeshLatest News

Rains:రుతుపవన ద్రోణితో ఆ జిల్లాలలో మూడు రోజులు భారీ వర్షాలు!

Rains:ఉరుములతో కూడిన మెరుపులు,గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.

Rains

ఆంధ్రప్రదేశ్, యానాంలలో వాతావరణం కొన్ని రోజులుగా అస్థిరంగా ఉంది. ముఖ్యంగా, దక్షిణ అంతర కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన ఉత్తర-దక్షిణ ద్రోణి (North-South Trough) ప్రభావంతో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు(rains) మొదలయ్యాయి. దిగువ ట్రోపో ఆవరణములో వీస్తున్న నైరుతి గాలులు ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అండ్ యానాంలో మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు..ఈ ప్రాంతంలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉంది. అయితే, ఒకటి లేదా రెండు ప్రాంతాలలో భారీ వర్షాలు(rains) పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, ఉరుములతో కూడిన మెరుపులు,గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.

rains
rains

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలు జాగ్రత్త.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా వాతావరణం ఇదే విధంగా ఉంటుంది. ఈరోజు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బలమైన గాలులు తీరం వెంబడి ప్రభావం చూపే అవకాశం ఉంది. రేపు , ఎల్లుండి తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి.

రాయలసీమలో వాతావరణం మరింత వేగంగా మారనుంది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు ఈ ప్రాంతంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది,ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా సంభవించవచ్చు. ఎల్లుండి కూడా అనేక చోట్ల ఇదే విధమైన వర్షాలు కొనసాగుతాయి.

ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రైతులు కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, పొలాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా జాగ్రత్తగా ప్రయాణించడం అవసరం.

నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొచ్చు.ఈ వాతావరణ మార్పులు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సంభవిస్తున్నాయి. ప్రజలు, రైతులు ఈ సూచనల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Sati Devi :సతీదేవి శక్తిపీఠం శ్రీలంకలో ఎందుకు? శాంకరీ క్షేత్రం రహస్యాలు

 

Related Articles

Back to top button