Just Andhra PradeshJust Crime

liquor scam : లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి అరెస్ట్ ..తరువాత జగనేనా..?

liquor scam :వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది

liquor scam : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా శనివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి (Mithun Reddy)ని SIT అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌తో ఏపీ రాజకీయాల్లో అలజడి మొదలైంది. నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి.

liquor scam

ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వైసీపీ (YCP) ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలయ్యాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ కింద, ప్రభుత్వం మద్యం అమ్మకాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమయంలోనే కొన్ని బ్రాండెడ్ లిక్కర్‌ను పక్కన పెట్టి, కొత్త, పెద్దగా తెలియని బ్రాండ్‌లకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ కొత్త బ్రాండ్‌ల నుంచి భారీగా ముడుపులు (కిక్‌బ్యాక్‌లు) తీసుకొని వాటికి అక్రమంగా ఆర్డర్‌లు ఇచ్చారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ప్రధాన ఆరోపణ. దీని విలువ సుమారు రూ. 3,200 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లు వరకు ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం డిపో మేనేజర్‌ల లాగిన్ ఐడీలను ఉపయోగించి, లంచాల ఆధారంగానే బ్రాండ్‌ల ఆర్డర్‌లు పెట్టారని, వినియోగదారుల డిమాండ్ ఆధారంగా కాదని SIT దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

2019 – 2024లో YSRCP పాలనలో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికీ నష్టం జరిగిందని నివేదికలు వచ్చాయి. ముఖ్యంగా, కాలేయ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగాయని కొన్ని నివేదికలు సూచించాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ లిక్కర్ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది.

2025 ఏప్రిల్ 21లో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా పనిచేసిన కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కెసిరెడ్డి)ని SIT ప్రధాన నిందితుడిగా గుర్తించి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌కు అతనే కీలక సూత్రధారి అని పోలీసులు పేర్కొన్నారు.తాజాగా ఇదే కేసులో మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.

SIT ఇప్పటికే 300 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను, అలాగే ప్రిలిమినరీ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో 100కు పైగా రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(RFSL) నివేదికలను సమర్పించారు. ఈ కేసులో ఇప్పటివరకు రూ. 62 కోట్లను సీజ్ చేసినట్లు SIT వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా 268 మంది సాక్షులను SIT అధికారులు విచారించారు.

మిథున్ రెడ్డి అరెస్ట్- A4 నిందితుడిగా పేరు..

శనివారం రాత్రి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని SIT అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో డొల్ల కంపెనీల (Shell Companies) ద్వారాప్రైమ్ బెనిఫిషరీ’కి (అసలు లబ్ధిదారుడికి) లబ్ధి చేకూర్చిన విషయమై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. .విచారణ తర్వాత, అరెస్ట్‌కు ముందు నోటీసులు ఇచ్చి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వివిధ కంపెనీల ద్వారా ఒక వ్యక్తికి ముడుపులు (Kickbacks) చేరవేశారని, అందుకే మిథున్ రెడ్డికేసులో కీలక నిందితుడిగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

మిథున్ రెడ్డి అరెస్ట్‌తో, ఈ కేసులో ప్రత్యక్ష పాత్ర ఉన్నవారు ఒక్కసారిగా డైలమాలో పడ్డారు. ఇప్పుడు అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపైనే ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే మద్యం కుంభకోణం జరిగిందని, హవాలా మార్గాల ద్వారా డబ్బులు జగన్ వద్దకు చేరాయని, ఇందులో మిథున్ రెడ్డికి ప్రత్యక్ష పాత్ర ఉందని మంత్రులు ఆరోపించారు. వారి ఆరోపణలకు తగ్గట్టుగానే ఇప్పుడు SIT విచారణ, అరెస్ట్‌లు జరుగుతున్నాయి.

జగన్‌ను కూడా అరెస్ట్ చేస్తే??

జగన్ ఇప్పటికే ఇతర కేసుల్లో (ఉదాహరణకు, అక్రమాస్తుల కేసు) బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడుమద్యం కుంభకోణం కేసులో కూడా అరెస్ట్ అయితే, అది ఆయన బెయిల్ రద్దుకు దారితీస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త కేసుల్లో అరెస్ట్ కావడం, ముఖ్యంగా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో, గతంలో ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి కోర్టులకు ఒక ప్రాతిపదిక అవుతుంది. ఈ కేసులో కూడా బెయిల్ దొరకడం కష్టమయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కుంభకోణంలో పరోక్షంగా ఉన్న కొందరు వ్యక్తులు నల్ల డబ్బును (Black Money) వేరే మార్గాల ద్వారా తెల్ల డబ్బుగా (White Money) మార్చారని, అందులో కొంత డబ్బును చిత్ర పరిశ్రమలోకి మళ్లించారని SIT అధికారులు చెబుతున్నారు. ఆ సినిమాలు రూపొందించినవారు అప్పటి వైసీపీకి అత్యంత సన్నిహితులని అధికారులు అంటున్నారు. త్వరలోనేవ్యక్తులను కూడా SIT అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

కేసులో ఇంకా చాలా నిజాలను వెలికితీయాల్సి ఉందని, SIT దిశగా విచారణను కొనసాగిస్తోందని వార్తలు వస్తున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్‌తో మొదలైనప్రకంపనలు, ఏపీ రాజకీయాలనుమలుపు తిప్పుతాయో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button