Free mobile:వారికి ఫ్రీగా మొబైల్ ఫోన్లు ..ఎక్కడ? ఎలా అప్లై చేయాలి?
Free mobile:దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా కనీసం 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అలాగే, విద్యార్హత విషయంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

Free mobile
ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. సమాజంలో ఎంతోమంది తమ ప్రతిభ ఉన్నప్పటికీ, భౌతిక లోపాల వల్ల అసంపూర్ణంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మౌన , శ్రవణ సమస్యలున్న (hearing and speech impaired) వారికి సమాచార మార్పిడి అనేది ఒక పెద్ద సవాల్.
ఈ సమస్యను గుర్తించిన ఏపీ సర్కార్, వారికి డిజిటల్ ప్రపంచంలో ఒక కొత్త దారి చూపించేందుకు సిద్ధమైంది. అర్హత గల డెఫ్ అండ్ మ్యూట్ (deaf and mute )వారికి ఉచితంగా టచ్స్క్రీన్ మొబైల్ ఫోన్లు(Free mobile) ఇవ్వనున్నట్లు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఎ.డి.వి. కామరాజు ప్రకటించారు. ఇది కేవలం ఒక ఫోన్ పంపిణీ కాదు, వారి జీవితాలను డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం చేసే ఒక గొప్ప ప్రయత్నం అనే చెప్పొచ్చు.
ఈ పథకం కింద సెల్ ఫోన్ల(Free mobile)ను పొందడానికి కొన్ని అర్హత ప్రమాణాలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా కనీసం 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అలాగే, విద్యార్హత విషయంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వీటన్నింటికీ తోడు, వారికి సైగల భాషలో ప్రావీణ్యం ఉండాలి. వైద్యపరంగా 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించే లక్ష్యంతో, దరఖాస్తుదారు కుటుంబం యొక్క వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఈ పథకానికి ఆసక్తి గల వారు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా www.apdascac.ap.gov.in అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, వైకల్యం ధ్రువీకరణ పత్రం, సైగల భాష సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాలకు), ఆదాయ సర్టిఫికెట్ , తెల్ల రేషన్ కార్డు కాపీ, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
అలాగే 18 ఏళ్ల లోపు ఉన్న దివ్యాంగ బాలబాలికలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని అందిస్తోంది. ‘సమగ్ర శిక్ష’ పథకం కింద వారికి అవసరమైన పరికరాలు అందజేస్తున్నారు. దీని కోసం ఏపీ వ్యాప్తంగా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ఈ నెల 26వ తేదీతో ముగుస్తాయి. ఈ శిబిరాలలో పిల్లల అవసరాలను గుర్తించి, వారికి తగిన పరికరాలను అందిస్తారు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలేంటంటే..ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యూడీఐడీ కార్డు, వైకల్యం ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
ఈ (Free mobile)పథకం ద్వారా వారికి మూడు చక్రాల సైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు వంటివి అందజేస్తారు. అలాగే, చూపు సమస్యలున్నవారికి, మానసిక దివ్యాంగులకు వారి అవసరాలకు అనువైన ప్రత్యేక TLM కిట్లు (Teaching-Learning Material) కూడా అందజేయనున్నారు.
ఈ రెండు పథకాలూ దివ్యాంగులను సమాజంలో మరింత భాగం చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న గొప్ప ముందడుగు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారి భవిష్యత్తుకు భరోసానిస్తుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి