Just BusinessLatest News

Gold price: భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి ఏకంగా రూ. 23,000 పతనం..కొనడానికి ఇదే మంచి సమయమా?

Gold price: ముక్కోటి ఏకాదశి వేళ ఎవరూ ఊహించని విధంగా బంగారం ,వెండి ధరలు భారీగా తగ్గాయి.

Gold price

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పసిడి ప్రేమికులకు, సామాన్య ప్రజలకు బులియన్ మార్కెట్ పెద్ద ఊరటనిచ్చింది. పండుగ వేళ ఎవరూ ఊహించని విధంగా బంగారం ,వెండి ధరలు (Gold price)భారీగా తగ్గాయి. కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా కుప్పకూలడం విశేషం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ , విశాఖపట్నంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. నేటి మార్కెట్ సమాచారం ప్రకారం పది గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 3,050 తగ్గి ఇప్పుడు రూ. 1,36,200 వద్ద కొనసాగుతోంది. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న సమయంలో , పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు ఈ స్థాయిలో తగ్గడం కొనుగోలుదారులకు ఒక గొప్ప అవకాశమని అనే చెప్పాలి.

బంగారం ధరల(Gold price)ను విశ్లేషిస్తే కేవలం 24 క్యారెట్లు మాత్రమే కాకుండా ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా బాగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2,800 తగ్గి ఇప్పుడు రూ. 1,24,850 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఇది పది గ్రాములపై రూ. 2,510 మేర తగ్గి రూ. 1,01,930 కు చేరుకుంది.

కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 తగ్గి రూ. 1,36,350 గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,25,000 వద్ద ఉంది. అటు ముంబైలో కూడా హైదరాబాద్‌కు సమానంగా 24 క్యారెట్ల ధర రూ. 1,36,200 గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన కొన్ని అనిశ్చిత పరిస్థితులు , ఇన్వెస్టర్ల ధోరణి మారడం వల్ల ధరలు ఇలా ఒక్కసారిగా తగ్గాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Gold price
Gold price

బంగారం ధరల(Gold price) కంటే వెండి ధరలు అయితే ఈరోజు మరీ మరింత ఆశ్చర్యకరంగా తగ్గాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 23,000 పడిపోవడంతో సామాన్యులు సంబరపడుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం ,విజయవాడ నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,58,000 కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర కిలోపై రూ. 18,000 తగ్గి రూ. 2,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

సాధారణంగా బంగారం ధరల్లో మార్పులు వచ్చినప్పుడు వెండి ధరలు కూడా ప్రభావితమవుతాయి, కానీ ఈ స్థాయిలో వేల రూపాయల వ్యత్యాసం రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు బంగారం లేదా వెండి వస్తువులను కొనడం శుభప్రదంగా భావించే భక్తులకు నేటి ధరలు ఎంతో అనుకూలంగా మారాయి.

అయితే బంగారం ధరలు స్థిరంగా ఉండవనే విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు , కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల ఆధారంగా ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీరు గనుక ఏదైనా ఆభరణం చేయించుకోవాలని లేదా పెట్టుబడిగా బంగారం, వెండి కొనాలని భావిస్తే ఈరోజే కొంటే మంచిదని అంటున్నారు నిపుణులు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button