Just BusinessLatest News

Today’s gold: పసిడి పరుగుకు బ్రేక్ …ఈరోజు తులం బంగారం రేటు ఎంత?

Today's gold: ప్రతిరోజూ రికార్డు స్థాయికి చేరుకుంటూ కొనుగోలుదారులకు భారంగా మారిన పసిడి ధరలు, నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టడం విశేషం.

Today’s gold

కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు (Today’s gold)ఎట్టకేలకు దిగివచ్చాయి. ప్రతిరోజూ రికార్డు స్థాయికి చేరుకుంటూ కొనుగోలుదారులకు భారంగా మారిన పసిడి ధరలు, నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టడం విశేషం. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి కూడా అదే బాటలో నడుస్తూ ధర తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పసిడి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ధరలు(Today’s gold) తగ్గడానికి కారణాలేంటి అంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ బలహీనపడటం మరియు అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడ్) వడ్డీ రేట్ల పెంపు వంటి నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపిస్తారు లేదా విక్రయిస్తారు. ఈ పరిణామాల వల్లే ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు తులం బంగారంపై ఏకంగా 1,520 రూపాయల మేర తగ్గింది. ఆ తర్వాత కూడా తగ్గుదల కొనసాగుతూ బుధవారం ఉదయం నాటికి మరో 100 రూపాయల వరకు ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములు) ధర 1,33,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే నగలు తయారు చేసేందుకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర 1,22,690 రూపాయల వద్ద ఉంది.

Today's gold
Today’s gold

బంగారంతో పాటే వెండి కూడా తన ధరను తగ్గించుకుంది. మంగళవారం కిలో వెండి ధర 1,99,000 రూపాయలుగా ఉండగా, బుధవారం నాటికి స్వల్ప మార్పులతో ప్రస్తుతం 1,99,100 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరల్లో ఈ చిన్న మార్పులు కొనుగోలుదారులపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, బంగారం భారీగా తగ్గడం మాత్రం సామాన్యులకు కలిసొచ్చే అంశం.

మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్,విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,33,850 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల ధర 1,22,690 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం 1,34,000 రూపాయలకు లభిస్తోంది. ముంబై , బెంగళూరు నగరాల్లో హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం బంగారం ధర అన్ని నగరాల కంటే ఎక్కువగా 1,34,720 రూపాయలుగా నమోదైంది.

అయితే బంగారం , వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ప్రతి గంటకూ మారే అవకాశం ఉంటుంది. డాలర్ విలువ, ఫెడ్ నిర్ణయాలు మారితే ఈ ధరలు మళ్లీ పెరగొచ్చు లేదా ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే ముందు ఒకసారి స్థానిక షోరూమ్‌లో తాజా ధరను చెక్ చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button