Just Spiritual

Shiva temples : రావణుడు కట్టించిన శివయ్య ఆలయాల గురించి విన్నారా?

Shiva temples : రావణుడు స్వయంగా ఆరాధించిన, ప్రతిష్టించిన శివాలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి వెనుక దాగి ఉన్న పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

Shiva temples : దేశం నలుమూలలా కోట్లాది మంది భక్తులు కొలిచే అమ్మవార్ల ఆలయాలు, లయకారుడైన మహాదేవుని క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే, శివుడి(Shiva) పేరు తలవగానే మన మదిలో మెరిసే అనూహ్య భక్తులలో లంకాపతి రావణుడు ఒకడు. అసుర చక్రవర్తి అయినా, శివయ్యకు పరమ భక్తుడిగా రావణుడికి అపారమైన కీర్తి ఉంది. మహాదేవుని అనుగ్రహం కోసం అతను చేసిన కఠోర తపస్సులు, పొందిన వరాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మరి, రావణుడు స్వయంగా ఆరాధించిన, ప్రతిష్టించిన శివాలయాలు ఎక్కడ ఉన్నాయి? వాటి వెనుక దాగి ఉన్న పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

Shiva temples

రాజస్థాన్‌లోని ఉదయపూర్ సమీపంలో ఉన్న అవర్‌ఘర్ కొండలపై కొలువైన కమల్‌నాథ్ మహాదేవుడి ఆలయం లంకాపతి రావణుడి (Ravana)చేతుల్లోనే స్థాపించబడిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు కైలాస పర్వతంపై తీవ్ర తపస్సు చేశాడు. శివయ్య అతని భక్తికి మెచ్చి, తన ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదించాడు. ఈ లింగాన్ని లంకకు తీసుకువెళ్లే వరాన్ని రావణుడు పొందినా కూడా, మధ్యలో ఎక్కడా నేలపై ఉంచకూడదనే షరతును శివయ్య పెట్టాడు.

ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరిన రావణుడు, మార్గమధ్యంలో అలసిపోయి, అనుకోకుండా ఆ లింగాన్ని ఒక చోట నేలపై ఉంచి విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తర్వాత ఎంత ప్రయత్నించినా, ఆ శివలింగం నేల నుంచి పైకి రాలేదు. తన పొరపాటును గ్రహించిన రావణుడు, ఆ ప్రదేశంలోనే శివయ్యను పూజించడం మొదలుపెట్టాడు. రోజూ 100 కమలాలతో శివయ్యను ఆరాధించేవాడు, తన లంకకు తిరిగి తీసుకెళ్లే అవకాశం కోసం ప్రార్థించేవాడు.

ఇలా అనేక సంవత్సరాలు తపస్సు చేసిన రావణాసురుడి భక్తి ఫలించబోతుండగా, ఒకరోజు బ్రహ్మదేవుడు మాయ చేసి, అతని 100 తామరపువ్వుల నుండి ఒక పువ్వును మాయం చేశాడని కథనం. ఒక పువ్వు తగ్గినందున, రావణుడు తన భక్తికి పరాకాష్టగా, 100వ పువ్వుకు బదులుగా తన తలనే నరికి శివుడికి సమర్పించాడు. రావణాసురుడి ఈ అసాధారణ భక్తికి సంతోషించిన మహాదేవుడు, అతని నాభిలో అమృత కుండాన్ని వరంగా ఇచ్చాడని, అప్పటి నుంచి ఆ శివయ్యను కమల్‌నాథ్ మహాదేవుడు అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయం కూడా రావణుడితో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది. దీని కథ కూడా కమల్‌నాథ్ మహాదేవుడి ఆలయం తరహాలోనే ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మొదలవుతుంది. ఇక్కడ కూడా శివలింగాన్ని భూమిపై ఉంచవద్దనే షరతును రావణుడు పాటించలేదని నమ్ముతారు. శివలింగాన్ని చేతిలోంచి నేలపై ఉంచిన తర్వాత, దాన్ని తిరిగి ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా విఫలమయ్యాడు. దీంతో కోపంతో, నిరాశతో రావణుడు ఆ శివలింగాన్ని భూమిలోకి పాతిపెట్టాడని ప్రతీతి. అందుకే, బాబా బైద్యనాథుడి లింగం పై భాగం చిన్నగా, భూమిలో కూరుకుపోయినట్లు కనిపిస్తుందని చెబుతారు.

లంకలో శివాలయాలే కాదు, అమ్మవారి ఆలయాలకూ రావణుడు ప్రసిద్ధి చెందాడు. శ్రీలంకలోని త్రికోణమాలి అనే ప్రదేశంలో ఉన్న శంకరీ దేవి ఆలయం ఒక ముఖ్యమైన శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం, సతీదేవి చీలమండలు (కాలి గజ్జెలు) ఈ ప్రదేశంలో పడ్డాయని నమ్మకం. రావణుడు స్వయంగా ఈ ఆలయంలో శక్తిదేవిని ప్రతిష్టించాడని ప్రతీతి. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారి ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శించి తమ మొక్కులు తీర్చుకుంటారు. రావణుడు కేవలం శివభక్తుడు మాత్రమే కాకుండా, శక్తి ఆరాధకుడని కూడా ఇది నిరూపిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button