Just SpiritualLatest News

Jyotirlinga: మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ ఆలయం..ఎందుకంత ప్రత్యేకమంటే?

Jyotirlinga: అర్ధరాత్రి వేళ ఆలయం చుట్టూ సముద్రపు అలల శబ్దం, భక్తులు చేసే 'ఓం నమః శివాయ' జపం అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.

Jyotirlinga

సముద్రపు అలల ధ్వని, పురాణాల ప్రతిధ్వని, భక్తుల ఆర్తిని మేళవించి నిలిచిన ఒక అద్భుతమైన ప్రదేశం సోమనాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాల(Jyotirlinga)లో మొదటిదిగా భావించే ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదుపప ఇది భారతీయ ఆధ్యాత్మికతకు, పట్టుదలకు, మరియు విశ్వాసానికి ప్రతీక. వేల సంవత్సరాల చరిత్ర, ఎన్నో దాడులను, ధ్వంసాలను ఎదుర్కొని ప్రతిసారి శివ భక్తుల కృషితో పునర్నిర్మింపబడిన ఈ ఆలయం భక్తులకు ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది. సోమనాథ్ దర్శనం ప్రతి శివభక్తుడికి ఒక గొప్ప కల.

సోమనాథ్ జ్యోతిర్లింగం(Jyotirlinga) వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. చంద్రుడు తన 27 మంది భార్యలలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించడం వల్ల, మిగిలిన భార్యల తండ్రి అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుని కాంతిని కోల్పోవాలని శపించాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి చంద్రుడు, అతని భార్య రోహిణి కలిసి కోటి లింగాలను ప్రతిష్టించి శివుడిని ప్రార్థించారట. వారి భక్తికి మెచ్చిన శివుడు చంద్రునికి తిరిగి కాంతిని ప్రసాదించాడు. అందుకే చంద్రుడికి మరొక పేరు ‘సోముడు’. శివుడు చంద్రుడిని కాపాడిన ఈ క్షేత్రానికి ‘సోమనాథ్’ అనే పేరు వచ్చింది.

ఈ ఆలయం భారత దేశంలో వెలసిన మొట్టమొదటి జ్యోతిర్లింగం. అనేక దాడులకు గురైన ఈ ఆలయం, ప్రతిసారి భక్తుల అచంచలమైన విశ్వాసంతో మరింత వైభవంగా పునర్నిర్మితమైంది. ఈ ఆలయ శిల్పకళ, సముద్రపు ఒడ్డున దాని నిర్మాణం, భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.

సోమనాథ్ స్వామిని భక్తులు ‘చంద్ర శంకరుడు’, ‘త్రికాలేశ్వరుడు’ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, చంద్రగ్రహణ సమయంలో విశేష పూజలు జరుగుతాయి. అర్ధరాత్రి వేళ ఆలయం చుట్టూ సముద్రపు అలల శబ్దం, భక్తులు చేసే ‘ఓం నమః శివాయ’ జపం అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయాన్ని చూడటం ద్వారా భక్తులకు భయం తొలగిపోయి, మనసుకు శాంతి, ప్రశాంతత లభిస్తాయని చెబుతారు.

Jyotirlinga
Jyotirlinga

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోమనాథ్ క్షేత్రం(Somnath Jyotirlinga) గుజరాత్‌లోని వేరావళ్ పట్టణ సముద్రతీరంలో ఉంది. రోడ్డు మార్గం, రైలు మార్గంలో రాజ్కోట్, జునాగఢ్, అహ్మదాబాద్ వంటి పట్టణాల నుంచి సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలం అత్యుత్తమం. మహాశివరాత్రి సమయంలో ఆలయం భక్తులతో కళకళలాడుతుంది. ఈ క్షేత్రానికి దగ్గరలో బాల్కా తీర్థ, భల్కా తీర, త్రివేణి సంగమం వంటి అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి.

రాత్రి వేళల్లో ఆలయంపై వెలుగుతున్న జ్యోతులు, సముద్రపు నీలి తీరంపై వాటి ప్రతిబింబం జీవితంలో ఒక్కసారి అయినా చూసి మనసారా అనుభవించాల్సిన దివ్యమైన దృశ్యం. సోమనాథ్ కేవలం ఒక ఆలయం కాదు, అది శివత్వం, విశ్వాసం, మరియు శాశ్వతమైన జీవిత సౌందర్యానికి నిలయం.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button