Just SportsJust Andhra Pradesh

cricket:ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-4..క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..

cricket: APLను IPL తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. క్రికెట్ అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తుండగా, విశాఖ వేదికగా జరగనున్న వేలం ప్రక్రియ (player auction)తో క్రికెట్ సందడి మొదలుకానుంది.

cricket: ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ అభిమానులకు, క్రీడాకారులకు డబుల్ ధమాకా కబురు రెడీ అయింది.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-4 (Season 4)కు రంగం సిద్ధమైంది. ఈసారి APLను IPL తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. క్రికెట్ అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తుండగా, విశాఖ వేదికగా జరగనున్న వేలం ప్రక్రియ (player auction)తో క్రికెట్ సందడి మొదలుకానుంది.

ఏపీ క్రికెట్ ఫ్యాన్స్‌కు అల్టిమేట్ గుడ్‌న్యూస్ 

APL సీజన్-4: పూర్తి వివరాలు..

APL గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ కృష్ణ రంగారావు అందించిన వివరాల ప్రకారం, ఈ నాల్గో సీజన్ కొద్దిరోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.

లక్ష్యం: ఏపీలోని క్రికెట్ క్రీడాకారుల్లోని దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం, మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు కూడా ఒక చక్కటి వేదిక కల్పించడం APL ప్రధాన లక్ష్యం. IPL స్థాయికి ఏపీ క్రికెటర్లు ఎదగాలనే ఆకాంక్షతో ACA ఈ లీగ్‌ను నిర్వహిస్తోంది.

ఫ్రాంచైజీలు: ఈసారి APL సీజన్-4లో ఏడు ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి.

ప్లేయర్ల వేలం: క్రీడాకారుల వేలం ప్రక్రియ ఎల్లుండి అంటే ఈ నెల 14న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ వేలం APL సందడికి నాంది పలకనుంది.

మ్యాచులు ప్రారంభం: ఆగస్ట్ నెలలో క్రికెట్ జాతర మొదలవుతుంది. ఆగస్ట్ 8వ తేదీ నుంచి APL మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

మ్యాచ్‌ల సంఖ్య: సీజన్-4లో మొత్తం 21 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 4 ప్లే-ఆఫ్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 24 మ్యాచులు జరగనున్నాయి. ఇది ఆటగాళ్లలో టాలెంట్‌ను బయటకు తీయడానికి అద్భుతమైన అవకాశం అని సుజయ కృష్ణ రంగారావు చెప్పుకొచ్చారు. 

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు, ఏపీ క్రికెట్ భవిష్యత్తుకు ఒక వేదిక. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలోని ఎందరో యువ క్రికెటర్లు తమ కలలను సాకారం చేసుకుంటారని ఆశిద్దాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button