Just TelanganaLatest News

Warangal :వరంగల్ REC విప్లవ వీరుల పుట్టినిల్లా? మావోయిస్టులకు అది నైట్‌ హబ్ ఎందుకయింది?

Warangal :మేధోమథనం, తీవ్రవాద రాజకీయాలు ఇక్కడ కలగలిసిపోయి, పీపుల్స్ వార్ గ్రూప్ (PWG), ఆ తర్వాత సీపీఐ (మావోయిస్టు) వంటి సంస్థలకు భవిష్యత్ నాయకులను అందించాయి.

Warangal

ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల (REC) వరంగల్, ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్గా ప్రసిద్ధి చెందింది. అయితే, 1970లు, 80వ దశకంలో ఈ సంస్థ భద్రతా వర్గాలకు భారతదేశ మావోయిస్టు ఉద్యమానికి ఊయలగా సుపరిచితమైంది. మేధోమథనం, తీవ్రవాద రాజకీయాలు ఇక్కడ కలగలిసిపోయి, పీపుల్స్ వార్ గ్రూప్ (PWG), ఆ తర్వాత సీపీఐ (మావోయిస్టు) వంటి సంస్థలకు భవిష్యత్ నాయకులను అందించాయి.

మేధోమథనం కేంద్రంగా క్యాంపస్..1970, 1980లలో, REC వరంగల్(Warangal ) క్యాంపస్ విద్యార్థులలో విప్లవాత్మక ఆలోచనలకు కేంద్రంగా నిలిచింది. విద్యార్థులు, హాస్టల్ మెస్ కార్మికులు, చివరికి కొందరు అధ్యాపకులు సైతం తీవ్ర వామపక్ష భావజాలంలో మునిగిపోయారు. ఈ భావజాలమే క్రమంగా పీపుల్స్ వార్ గ్రూప్ (PWG), ఆపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నాయకత్వాన్ని తీర్చిదిద్దింది.

తెలంగాణ ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, “70లు, 80లలో, REC వరంగల్ రాడికల్ విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా ఉండేది.”

REC వరంగల్ నుంmr ఉద్భవించిన ప్రముఖ నాయకులు..
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు.. సీపీఐ (మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి.

చెరుకూరి రాజకుమార్ అలియాస్ ఆజాద్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మరియు అధికార ప్రతినిధి, ఉద్యమానికి మేధోపరమైన స్థిరత్వాన్ని అందించిన వ్యక్తి.

సదనాల రామకృష్ణ.. అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు.

Warangal
Warangal

జార్జ్ రెడ్డి హత్య ప్రభావం..REC వరంగల్‌లో తీవ్రవాద విత్తనాలు నాటుకోవడానికి ప్రధాన కారణం, 1972లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష నాయకుడు జార్జ్ రెడ్డి హత్య తర్వాత తెలంగాణలో తలెత్తిన విద్యార్థి తిరుగుబాటు జరగడం. జార్జ్ రెడ్డి హత్య పెద్ద ఎత్తున ఆగ్రహానికి దారి తీసింది.

RSU ఆవిర్భావం.. 1974లో, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU)కు చెందిన కొంతమంది విద్యార్థులు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) ను ఏర్పాటు చేశారు. విప్లవం కోసం యువతను సమీకరించడమే దీని లక్ష్యం.

వరంగల్ కేంద్రం..వరంగల్(Warangal ) ఈ రాడికల్ తరంగానికి నాడి కేంద్రంగా మారింది. 1978 నాటికి, RSU తమ రెండో రాష్ట్ర మహాసభను వరంగల్‌లో నిర్వహించింది.

ఆ మహాసభలోనే REC నుంచి రసాయన ఇంజనీరింగ్ విద్యార్థి అయిన ఆజాద్, ఆంధ్ర యూనిట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన 1980లో పీపుల్స్ వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు మూడుసార్లు ఆ పదవిని నిర్వహించారు.

క్యాంపస్‌లో పోలీస్ స్టేషన్.. అక్కడ నెలకొన్న పరిస్థితుల వల్ల, మేము REC వరంగల్‌లోపల ఒక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. REC తెలివైన విద్యార్థులను ఆకర్షించేది, మరియు కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి (పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు) వంటి నాయకులు వారితో క్రమం తప్పకుండా సంభాషించేవారని అప్పటి వరంగల్ ఎస్పీ (SP) జె.వి. రాముడు తెలిపారు.

REC క్యాంపస్ నుంmr ఉద్భవించిన మావోయిస్టు నాయకుల్లో ముఖ్యుడు చెరుకూరి రాజకుమార్ (ఆజాద్). రసాయన ఇంజనీర్‌ అయిన ఆయన, 2010లో మరణించే వరకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా , ఉద్యమానికి మేధోపరమైన దిశానిర్దేశం చేసే వ్యక్తిగా కొనసాగారు.

2018లో గణపతి తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజు (నంబాల కేశవరావు) మరణం (మే నెలలో)తో, REC క్యాంపస్‌లో మూలాలు ఉన్న ఒక తరం మావోయిస్టు నాయకత్వం ముగిసినట్లయింది.

Memory Boost: చదివింది మర్చిపోతున్నారా? అయితే ఇది వారి కోసమే..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button