Just BusinessJust NationalLatest News

Gold and silver : బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన ధరలు

Gold and silver: శుక్రవారం రాత్రి ముగిసిన మార్కెట్‌కు, శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభానికి మధ్య ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Gold and silver

బంగారం , వెండి(Gold and silver) కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది బిగ్ షాకింగ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. శుక్రవారం రాత్రి ముగిసిన మార్కెట్‌కు, శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభానికి మధ్య ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

పసిడి ధరల్లో పెను మార్పులు (Gold Price Hike)
శనివారం ఉదయం నమోదైన మార్కెట్ వివరాల ప్రకారం బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.

  • 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 1,860 పెరిగింది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 1,700 మేర పెరుగుదల నమోదైంది.
  • బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పులు కూడా ఒక కారణంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు (Ounce) గోల్డ్ ధర 5 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ ధర 4,065 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది.

  • 22 క్యారట్లు (10 గ్రాములు) నేడు రూ. 1,15,350 వద్ద ఉంది.
  • 24 క్యారట్లు (10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం (24 క్యారట్లు) ధర రూ. 1,25,840కు చేరింది.
Gold and silver
Gold and silver

ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలు
దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపుగా ఇదే స్థాయిలో పెరిగాయి:

  • దేశ రాజధాని ఢిల్లీ ఇక్కడ 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,500 కాగా, 24 క్యారట్ల ధర రూ. 1,25,990 వద్ద నమోదైంది.
  • ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 1,15,350గాను, 24 క్యారట్ల ధర రూ. 1,25,840గాను కొనసాగుతోంది.

బంగారం మాత్రమే కాక, వెండి ధరల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 3,000 పెరిగింది. గురు, శుక్రవారాల్లో వెండి రేటు రూ. 7,000 వరకు తగ్గగా, శనివారం ఒక్కసారిగా రూ. 3,000 పెరగడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర..

  • హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాల్లో కిలో వెండి ధర భారీగా పెరిగి రూ. 1,72,000 వద్దకు చేరింది.
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ. 1,64,000 వద్ద కొనసాగుతోంది.చెన్నైలోనూ కిలో వెండి ధర రూ. 1,64,000 వద్దకు చేరింది.

అయితే బంగారం కొనాలని అనుకున్నవారు పైన పేర్కొన్న ధరలు మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే అని గమనించాలి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి-డాలర్ మారకం రేటు మరియు స్థానిక డిమాండ్‌ను బట్టి బంగారం, వెండి ధరలు(Gold and silver) రోజువ్యాప్తంగా , ఆ తర్వాత కూడా మారుతూ ఉంటాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button