hydrogen train : భారత్లో తొలి హైడ్రోజన్ రైలు వచ్చేసింది..
hydrogen train : ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ ట్రాక్పై పరుగులు పెట్టనున్న ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది

hydrogen train : భారత రైల్వేలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. శుక్రవారం, భారత రైల్వే హైడ్రోజన్తో నడిచే రైలును విజయవంతంగా పరీక్షించింది. చెన్నైలోని ప్రతిష్టాత్మక ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ కీలకమైన ట్రయల్ నిర్వహించారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఆగస్టు 2025 చివరి నాటికి దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు(hydrogen train) జింద్-సోనిపట్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరం పరుగులు తీయనుంది. ఈ శుభవార్తను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ధృవీకరించి, టెస్ట్ రన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రజల్లో ఉత్సాహం నిండింది. భవిష్యత్తులో ఇలాంటి దాదాపు 35 రైళ్లను నడపాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
hydrogen train
ఈ హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఏంటి?
ఈ వినూత్న రైలు నాన్-ఏసీ బోగీలతో వస్తుంది. దీనికి రెండు అత్యాధునిక హైడ్రోజన్ ఇంధన శక్తి ఇంజిన్లు అమర్చి ఉంటాయి. మొత్తం 8 ప్యాసింజర్ కోచ్లతో ఇది ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ ట్రాక్పై పరుగులు పెట్టనున్న ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ICF అభివృద్ధి చేస్తున్న 1200 హార్స్పవర్ ప్రోటోటైప్ హైడ్రోజన్ ఇంజిన్, తక్కువ దూర ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
మొదటి పవర్ కారు (ఇంజిన్) పరీక్షలు పూర్తయ్యాయని, రెండో పవర్ కారును రాబోయే రెండు వారాల్లో పరీక్షిస్తామని ICF జనరల్ మేనేజర్ సుబ్బారావు తెలిపారు. ఆ తర్వాత మొత్తం 8 కోచ్లతో కూడిన రైలును సంయుక్తంగా పరీక్షిస్తారు. ఆగస్టు 31, 2025 నాటికి ఈ హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించాలని రైల్వేలు ప్లాన్ చేస్తున్నాయి. తుది పరీక్షలను ఉత్తర రైల్వే స్వయంగా పర్యవేక్షించనుంది.
పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న భారత రైల్వేలు, “హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్” అనే వినూత్న చొరవ కింద ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్-శక్తితో నడిచే రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి హైడ్రోజన్ రైలుకు సుమారు రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అంతేకాకుండా, కొండ ప్రాంతాల్లోని మార్గాల్లో మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి ఒక్కో రూట్కు రూ.70 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
ఉత్తర రైల్వేలోని జింద్-సోనిపట్ విభాగంలో నడపడానికి వీలుగా, హైడ్రోజన్ ఇంధన కణాలతో కూడిన డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను తిరిగి అమర్చడానికి రూ.111.83 కోట్ల విలువైన పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. హైడ్రోజన్ రైళ్ల ప్రారంభ నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండవచ్చు కానీ, దీర్ఘకాలంలో అవి తగ్గుతాయని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రయోగం భారత రైల్వేలకు, దేశ పర్యావరణ పరిరక్షణకు ఒక కొత్త శకాన్ని ప్రారంభించనుంది. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో, శుభ్రమైన, పచ్చని భవిష్యత్తు వైపు అడుగులు వేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
First Hydrogen powered coach (Driving Power Car) successfully tested at ICF, Chennai.
India is developing 1,200 HP Hydrogen train. This will place India among the leaders in Hydrogen powered train technology. pic.twitter.com/2tDClkGBx0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 25, 2025