Just SportsLatest News

T20 World Cup : యూఎస్ఏపై పాకిస్థాన్ విజయం..గ్రూప్ ఏలో టాప్ ప్లేస్

T20 World Cup : టీ20 ప్రపంచకప్ లో యూఎస్ఏ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్ లో భారత్ పై ఆకట్టుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది

T20 World Cup

టీ20 ప్రపంచకప్(T20 World Cup) లో యూఎస్ఏ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్ లో భారత్ పై ఆకట్టుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన సయీమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా(1) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ అజామ్ పాక్ ను ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ మూడో వికెట్ కు 52 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..బాబర్ అజామ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 46 రన్స్ కు వెనుదిరిగాడు.

అయితే చివర్లో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫర్హాన్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేయగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. చివర్లో షాదాబ్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో వాన్ షాల్క్ విక్ 4 వికెట్లు పడగొట్టాడు.

T20 World Cup
T20 World Cup

తర్వాత భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన యూఎస్ఏ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు ఆడ్రియస్ గౌస్ , జహంగీర్ తొలి వికెట్ కు 42 పరుగులు జోడించారు. గౌస్ (13) పరుగులకే ఔటవగా… కెప్టెన్ మోనాంక్ పటేల్ (3) నిరాశపరిచాడు. అయితే జహంగీర్ 34 బంతుల్లో 49 ( 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. తర్వాత మిలింద్ , రంజానే దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగినట్టు కనిపించింది. 30 బంతుల్లోనే 51 ( 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవడంతో యూఎస్ఏ ఓటమి ఖాయమైంది.

చివరికి యూఎస్ఏ 20 ఓవర్లలో 158 పరుగులే చేయగలిగింది. వరుసగా రెండో విజయం సాధించిన పాక్ గ్రూప్ లో అగ్రస్థానానికి చేరుకుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button