Just Andhra PradeshLatest News

Turakapalem: తురకపాలెం మిస్టరీ మరణాలు..మూఢనమ్మకాలు వెర్సస్ శాస్త్రీయ కోణాలు

Turakapalem: 2020లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో కూడా ఇలాంటి అకస్మాత్తుగా జరిగిన న్యూరోలాజికల్ సిండ్రోమ్ మరణాలు ఆందోళన కలిగించాయి.

Turakapalem

రెండు నెలల ముందు వరకూ ప్రశాంతంగా, ఆనందంగా ఉన్న ఆ (Turakapalem)గ్రామంలో ఎవరో పగబట్టినట్లుగా వరుస చావులు వణికిస్తున్నాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా రెండు నెలల్లో 38 మందిని ఆ గ్రామం కోల్పోయింది. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాల వెనుక అసలు కారణం ఏమిటో తెలియక, ప్రజలు మానసికంగా కృంగిపోతున్నారు. అయితే, ప్రభుత్వం, వైద్య నిపుణుల బృందాలు రంగంలోకి దిగి, ఈ మిస్టరీ మరణాల గుట్టు విప్పే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మొత్తం వ్యవహారం ఒక మెడికల్ ఎమర్జెన్సీగా (medical emergency) పరిగణించి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

Turakapalem
Turakapalem

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గ్రామం(Turakapalem)లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్‌తో పాటు, గ్రామ చెరువులోని నీటి నమూనాలను కూడా సేకరించి, ఏమైనా హానికరమైన బ్యాక్టీరియా ఉందా అని నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్రామస్తులు ఎవరూ కలుషిత నీటిని వాడకుండా ఉండేందుకు, ప్రభుత్వం స్వయంగా వారికి సురక్షితమైన మంచి నీరు, ఆహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎయిమ్స్ మంగళగిరి నుంచి నిపుణులను కూడా పిలిపించి, ఈ పరిస్థితిపై సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు.

వైద్య నిపుణుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఈ మరణాలకు ప్రధాన కారణం మెలియొడిసిస్ అనే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యాధి బర్ఖోల్డేరియా సూడోమల్లెయ్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన నీరు, మట్టి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ. అనేక మరణాలు తీవ్రమైన మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల సంభవించినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది మెలియొడిసిస్ వ్యాధి లక్షణాలతో మ్యాచ్ అవుతోంది.

ఒకవైపు శాస్త్రీయ కారణాలను అన్వేషిస్తుంటే, మరోవైపు గ్రామస్తుల ఆందోళన వారిలోని మూఢనమ్మకాలను బయటపెట్టింది. కొందరు ప్రజలు ఈ మరణాల వెనుక “బొడ్రాయి”కి సంబంధించిన శక్తులు ఉన్నాయని, ఎవరో పగబట్టారని నమ్ముతున్నారు. ఈ భయాందోళనలను నివారించడానికి వైద్య అధికారులు కేవలం చికిత్స మాత్రమే కాకుండా, ప్రజలలో ఆరోగ్య అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.

Turakapalem
Turakapalem

2020లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో కూడా ఇలాంటి అకస్మాత్తుగా జరిగిన న్యూరోలాజికల్ సిండ్రోమ్ మరణాలు ఆందోళన కలిగించాయి. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి అంటువ్యాధి వ్యాప్తి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలు మూఢనమ్మకాలపై శాస్త్రీయ విజ్ఞానం గెలవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి.

తురకపాలెం(Turakapalem)లో ఇప్పుడు ఉన్న ప్రధాన సవాళ్లు వేగవంతమైన, కచ్చితమైన రోగ నిర్ధారణ , చికిత్స. మెలియొడిసిస్ అనేది సకాలంలో గుర్తిస్తే చికిత్స చేయగల వ్యాధి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పరిశుభ్రమైన నీరు, పర్యావరణం, స్థానిక ప్రజలలో ఆరోగ్య అవగాహన పెంచడం కీలకం. ప్రభుత్వం చేపట్టిన అప్రమత్తమైన, త్వరిత చర్యల ద్వారా మరణాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిస్థాయి నివేదిక వచ్చే వారం రానుండగా, ప్రభుత్వం, వైద్య శాఖల సమగ్ర పర్యవేక్షణ ద్వారా గ్రామంలో భద్రత, ఆర్థిక, సామాజిక స్థిరత్వం తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. తురకపాలెం ఘటన ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు మూఢనమ్మకాలకు చోటివ్వకుండా శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలనే ముఖ్యమైన పాఠం నేర్పుతోంది .

Yoga: టెన్షన్‌ను మాయం చేసే నాలుగు యోగాసనాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button