Just SpiritualLatest News

TTD EO:టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్..రెండోసారి వరించిన అద‌ృష్టం

TTD EO:గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే పనిచేసిన సింఘాల్, మళ్లీ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి హయాంలో అదే పదవిని పొందడం విశేషం.

TTD EO

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్ తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయనకు టీటీడీ ఈవో(TTD EO)గా రెండోసారి అవకాశం కావడం విశేషం. గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే పనిచేసిన సింఘాల్, మళ్లీ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి హయాంలో అదే పదవిని పొందడం విశేషం. ఇది ఆయనకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన స్వయంగా పేర్కొన్నారు.

టీటీడీ చరిత్రలో ఒక అధికారి రెండుసార్లు ఈవో(TTD EO)గా బాధ్యతలు చేపట్టడం అరుదుగా జరుగుతుంది. గతంలో కూడా టీటీడీకి ఈవోగా పనిచేసి, ఆయన తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతో, ఇప్పుడు సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ముఖ్యంగా, కాలినడకన వస్తున్నప్పుడు భక్తులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

TTD EO
TTD EO

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఈ అవకాశం కల్పించినందుకు సింఘాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల పవిత్రతను కాపాడాలని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం తనకు సూచించినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను శిరసావహించి పనిచేస్తానని సింఘాల్ చెప్పారు.

బదిలీ అయిన టీటీడీ పూర్వ ఈవో శ్యామలరావుకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 14 నెలల తన పదవీకాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చానని, రాబోయే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం పూర్వజన్మ సుకృతమని ఆయన కూడా పేర్కొన్నారు. ఈ ఇద్దరు అధికారులు కూడా టీటీడీ వంటి అత్యంత పవిత్రమైన సంస్థలో పనిచేయడం ఒక అరుదైన అవకాశం అని అభిప్రాయపడ్డారు.

Om Namah Shivaya: ఓం నమశ్శివాయ మంత్రం అర్ధం, జప మహిమ తెలుసా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button