Just TelanganaJust Andhra PradeshLatest News

Holidays: జనవరిలో వరుస సెలవుల పండగ..హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకోండి

Holidays: జనవరి మొదటి వారంలోనే న్యూ ఇయర్ సెలవులతో పాటు, నెల మధ్యలో వచ్చే సంక్రాంతి సెలవులు భారీగా ఉండబోతున్నాయి. దీంతో చాలా మంది ఇప్పుడే తమ ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటున్నారు.

Holidays

మరికొద్ది రోజుల్లో మనం 2025 కి గుడ్ బై చెప్పి 2026 కి స్వాగతం పలకబోతున్నాం. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే విద్యార్ధులకు, ఉద్యోగులకు వరుస సెలవులు(Holidays) రాబోతున్నాయి. జనవరి నెల వచ్చిందంటే చాలు పండగ వాతావరణం మొదలవుతుంది. ఈసారి కూడా జనవరి మొదటి వారంలోనే న్యూ ఇయర్ సెలవులతో పాటు, నెల మధ్యలో వచ్చే సంక్రాంతి సెలవులు(Holidays) భారీగా ఉండబోతున్నాయి.

దీంతో చాలా మంది ఇప్పుడే తమ ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ సెలవుల రద్దీని తట్టుకోవడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మీరు కూడా ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం.

జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో అప్పుడే సెలవుల (Holidays)సందడి మొదలవుతుంది. ఆ తర్వాత జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండగకు సంబంధించి ప్రభుత్వం దాదాపు ఒక వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండగలు ఉన్నాయి. ఈ మూడు రోజులు వరుసగా ప్రభుత్వ సెలవులు ఉంటాయి. వీటికి ముందు వచ్చే శని, ఆదివారాలు కూడా కలిస్తే దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు వరుసగా సెలవులు లభిస్తాయి. ఇక జనవరి 26న రిపబ్లిక్ డే కూడా సోమవారం రావడంతో, అంతకుముందు శని, ఆదివారాలు కలిపి మూడు రోజులు సెలవులు వస్తాయి. ఇలా జనవరి నెల మొత్తం సెలవుల జాతరలా ఉండబోతోంది.

Holidays
Holidays

సెలవుల సమయంలో ఊర్లకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అటు టీజీఎస్ఆర్టీసీ , ఏపీఎస్ఆర్టీసీ సంస్థలు వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించాయి. హైదరాబాద్ వంటి నగరాల నుండి సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. రద్దీని బట్టి సాధారణ చార్జీలతోనే అదనపు బస్సులు నడపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అలాగే రైల్వే శాఖ కూడా సికింద్రాబాద్, విజయవాడ మీదుగా ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రైల్వే స్టేషన్లు , బస్టాండ్ల వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైవేలపై ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్పెషల్ పెట్రోలింగ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగుతున్నాయి.

ఈ చలికాలంలో పర్యటనలకు వెళ్లాలనుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు అయితే విశాఖపట్నంలోని అరకు వ్యాలీ , లంబసింగిని ఎంచుకోవచ్చు. అక్కడ మంచు కురిసే అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారు తిరుపతి, శ్రీశైలం లేదా భద్రాచలం వెళ్లొచ్చు. ఒకవేళ మీరు చారిత్రక కట్టడాలు చూడాలనుకుంటే వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి లేదా అమరావతిలోని బౌద్ధారామాలను సందర్శించొచ్చు. వీటితో పాటు ఏపీలోని కోనసీమ అందాలు, తెలంగాణలోని లక్నవరం చెరువు , అనంతగిరి కొండలు కూడా పిక్నిక్ లకు చాలా అనువుగా ఉంటాయి. ఈ ప్రాంతాలన్నీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటాయి.

సెలవుల సమయంలో ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారు కనీసం పది రోజుల ముందే టికెట్లు , హోటల్స్ బుక్ చేసుకోవడం మంచిది. చివరి నిమిషంలో ధరలు పెరగడమే కాకుండా రద్దీ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో వ్యక్తిగత భద్రత , ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటూ మీ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోండి. కొత్త ఏడాదిని మరియు సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవడానికి ఈ సెలవుల లిస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button