Just TelanganaLatest News

Milk well: ఆ నీళ్లు తాగితే సర్వరోగాలూ మాయం..ఆ పాల బావి రహస్యమేంటి?

Milk well: కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, మొలంగూరు గ్రామంలో ఒక విచిత్రమైన బావి ఉంది.

Milk well

నీళ్లు ఎప్పుడైనా తెల్లగా ఉంటాయా? అదీ పాలలాగా! అబద్ధం అనిపిస్తోంది కదూ? కానీ అది నిజం. ఒక గ్రామంలోని బావిలో నీళ్లు పాలలా (Milk well)తెల్లగా ఉంటాయట. అంతే కాదు, ఆ నీళ్లు తాగితే ఎన్నో రోగాలు నయమవుతాయని ఆ గ్రామ ప్రజలు నమ్ముతున్నారు. ఇంతకీ ఆ వింత బావి ఎక్కడ ఉంది? దాని రహస్యం ఏంటో తెలుసుకుందాం.”

కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, మొలంగూరు గ్రామంలో ఒక విచిత్రమైన బావి ఉంది. మనం సాధారణంగా చూసే నీలం రంగు నీళ్లకు భిన్నంగా, ఈ బావిలో నీళ్లు పాలలా తెల్లగా ఉంటాయి. కొత్త వాళ్లు చూస్తే వాటిని అస్సలు నమ్మరు. అందుకే ఈ బావికి ‘దూద్ బావి’ (పాల బావి) అని పేరు పెట్టారు. ఈ నీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అవి నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

Milk well
Milk well

చరిత్ర మరియు విశ్వాసం..ఈ బావిని నిజాం పాలన కాలంలో తవ్వించారు. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మి, నిజాం నవాబు స్వయంగా ఈ బావిలోని నీటినే తాగేవారట. ఇక్కడి ప్రజలకు కూడా ఈ బావి(Milk well)పై అపారమైన నమ్మకం ఉంది. ఈ నీళ్లు తాగితే సర్వరోగాలు నయమవుతాయని, అందుకే వారు ఇంటింటికీ కుళాయిలు వచ్చినా సరే, ఈ బావి నీళ్లనే తాగుతున్నారని చెబుతారు.

ఈ నమ్మకాన్ని బలపరుస్తూ, దేశమంతా కరోనా విజృంభించినప్పుడు కూడా ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదట. ఈ బావి నీళ్లు (Milk well)తాగడం వల్లే కరోనా తమ గ్రామంలోకి రాలేదని గ్రామస్థులు గట్టిగా నమ్ముతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ నీటిని తీసుకెళ్తుంటారు. ఈ నీటి ప్రత్యేకతను తెలుసుకోవడానికి జలవనరుల సంస్థ కూడా దీనిపై పరిశోధనలు చేస్తోంది. ఈ నీళ్లలో ఎలాంటి ప్రత్యేకమైన మినరల్స్ ఉన్నాయనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

Thousand Pillar Temple: వేయి స్తంభాల గుడి.. కాకతీయుల కళా వైభవం,చరిత్రకు సాక్ష్యం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button