MoU: రూ.30,650 కోట్ల ఎంవోయూ ..ఆ 3 మెగా ప్రాజెక్టులు ఏంటి?
MoU: ఈ పెట్టుబడులు మౌలిక సదుపాయాలు (Infrastructure), క్లీన్ ఎనర్జీ (Clean Energy) , జల వనరుల (Water Resources) రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చనున్నాయి.
MoU
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు వేదికగా మారింది. విశాఖపట్నం వేదికగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) 2025 లో, రాష్ట్ర ప్రభుత్వంతో పలు కీలక కంపెనీలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంటున్నాయి.
ఈ సందర్భంగా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) గ్రూప్ , దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ రాష్ట్ర ప్రభుత్వంతో సుమారు రూ. 30,650 కోట్ల విలువైన మూడు వ్యూహాత్మక ఒప్పందాలపై సంతకం చేసి సంచలనం సృష్టించాయి. ఈ పెట్టుబడులు మౌలిక సదుపాయాలు (Infrastructure), క్లీన్ ఎనర్జీ (Clean Energy) , జల వనరుల (Water Resources) రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చనున్నాయి.
కుదిరిన 3 కీలక ఒప్పందాలు..
1. ట్రాన్స్ఫార్మర్ తయారీ యూనిట్ రూ. 5,000 కోట్లుతో కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో కట్టనున్నారు.రూ. 5,000 కోట్ల పెట్టుబడితో ట్రాన్స్ఫార్మర్ విడిభాగాలు, విండ్ మాస్ట్ (Wind Mast) తయారీ , ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది పారిశ్రామిక ఆవిష్కరణలను (Industrial Innovation) పెంచడానికి దోహదపడుతుంది.

2. ఇంటిగ్రేటెడ్ స్వచ్ఛ ఇంధన కేంద్రం రూ. 23,450 కోట్లుతో ఈ ఒప్పందం (MoU)విలువ అత్యధికంగా రూ. 23,450 కోట్లు. ఆంధ్రప్రదేశ్ అంతటా సౌర శక్తి (Solar), పవన శక్తి (Wind), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS), డైరెక్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ , ఒక పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సెంటర్తో కూడిన సమీకృత స్వచ్ఛ ఇంధన కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. భారతదేశం పునరుత్పాదక ఇంధన మార్పు దిశగా పయనించేందుకు ఈ పెట్టుబడి అత్యంత కీలకం.
3. డీశాలినేషన్ ప్లాంట్ మరియు జెట్టీ నిర్మాణం రూ. 2,200 కోట్లు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కరేడు గ్రామంలో నిర్మించనున్నారు.రూ. 2,200 కోట్ల విలువతో 200 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) సామర్థ్యం గల డీశాలినేషన్ ప్లాంట్ (ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్), అలాగే క్యాప్టివ్ జెట్టీ (Captive Jetty) , బార్జ్ డాక్ (Barge Dock) నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్లాంట్ వలన తీర ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది.
ఈ మూడు కీలక పెట్టుబడులు ఎస్ఎస్ఈఎల్ గ్రూప్ యొక్క పునరుత్పాదక ఇంధన రంగంలో నిబద్ధతను తెలియజేయడమే కాకుండా, రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూర్చనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించనున్నారు. సమీకృత స్వచ్ఛ ఇంధన కేంద్రం అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ముఖ్యమైన క్లీన్ ఎనర్జీ హబ్గా మారే అవకాశం ఉంది. డీశాలినేషన్ ప్లాంట్ మరియు జెట్టీ నిర్మాణం వలన లాజిస్టిక్స్ సామర్థ్యం (Logistics Efficiency) మెరుగుపడుతుంది.
ఎస్ఎస్ఈఎల్ గ్రూప్లోని ఇండోసోల్ సోలార్, 2026 నాటికి 10 GW ఇంటిగ్రేటెడ్ సోలార్ తయారీ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఇప్పటికే రామాయపట్నంలో 500 MW మాడ్యూల్ లైన్ను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా సిలికాన్, ఇంగోట్స్, వేఫర్లు, సెల్స్, మాడ్యూల్స్ మరియు సోలార్ గ్లాస్లను కవర్ చేసే పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ‘క్వార్ట్జ్-టు-మాడ్యూల్’ సౌకర్యం కోసం పునాది ఏర్పడుతుంది.




One Comment