Just Andhra PradeshJust PoliticalLatest News

Sunitha Reddy: సునీతారెడ్డి ఒంటరి పోరాటం ఇంకా కొనసాగుతుందా?

Sunitha Reddy: YS వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతారెడ్డి న్యాయపోరాటం, సీబీఐ తాజా వైఖరి, రాజకీయ ప్రభావం మరియు ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం.

Sunitha Reddy

వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు, ఇప్పుడు ఒక విషాద గాథగా మిగిలిపోయింది. తన తండ్రి హత్యకు న్యాయం జరగాలంటూ ఒంటరిగా పోరాడుతున్న సునీతారెడ్డి ఆశలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చివరికి మంచు గడ్డ వేసినట్లుగా తాజా పరిణామాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పదేపదే కోరినా, చివరికి తాము చేసిన దర్యాప్తు ముగిసిందని కోర్టుకు చెప్పడం, సునీత (Sunitha Reddy)పోరాటానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ వైఖరి చాలామందిని ఆశ్చర్యపరిచింది. సీబీఐ, కోర్టులో ..అవినాష్ బెయిల్‌పై ఉన్నా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా మా ఒత్తిడి మాత్రం వదిలివేయబడదని చెప్పడం గందరగోళానికి దారితీసింది. అంటే, అతను బెయిల్‌పై ఉన్నా మా పని మేము చేసుకుంటాం అన్నట్లుగా సీబీఐ చెప్పిన మాటలు, కేసుపై ఉన్న ఆశలను తగ్గించాయి. బెయిల్ రద్దుకు గట్టిగా ప్రయత్నించిన సీబీఐ, హఠాత్తుగా ఇలా చెప్పడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.

ఈ కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలను సీబీఐ పట్టించుకోలేదనే ఆరోపణలు మొదటినుంచీ ఉన్నాయి.జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి పాత్ర ఉన్నాయని సునీత పదేపదే చెబుతున్నా కూడా ఆ దిశగా సీబీఐ విచారణ సాగలేదు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజుననే జగన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. కానీ ఈ అంశంపై సీబీఐ పూర్తిస్థాయిలో విచారణ జరపలేదు. అలాగే, సాక్షి మీడియా యజమాని భారతిరెడ్డి పాత్ర గురించి కూడా దర్యాప్తు చేయకుండానే కేసును ముగించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

sunitha reddy
sunitha reddy

పోలీసుల నిర్లక్ష్యం కూడా సీబీఐ దృష్టి పెట్టలేదు. పోలీసులు హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం, ఆసుపత్రికి వెళ్లకుండానే వివేకా మరణాన్ని నిర్ధారించడం వంటి ఘటనలపైనా సీబీఐ తగినంత శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన సీబీఐ అధికారులను అడ్డుకున్నా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం, విచారణలో ఉన్న సీబీఐ అధికారిపైనే కేసులు పెట్టడం వంటివి ప్రజలకు సీబీఐ పట్ల అవిశ్వాసం కలిగించాయి.

సీబీఐ తన దర్యాప్తు ముగిసిందని తాజాగా చెప్పడంతో, ఇప్పుడు సునీతారెడ్డి(Sunitha Reddy) పోరాటం మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు శక్తివంతమైన ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం అండతో పనిచేస్తున్నాయని భావిస్తున్న సీబీఐ. ఈ రెండు వ్యవస్థలకు వ్యతిరేకంగా సునీత ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. అయితే, ఈ పోరాటంలో ఆమె(Sunitha Reddy)కు ప్రజల సానుభూతి, మద్దతు పుష్కలంగా ఉన్నాయి. సీనియర్ న్యాయవాది మహేశ్వరి ద్వారా హైకోర్టులో వేసిన పిటిషన్ వంటి న్యాయపరమైన చర్యలు ఇంకా కొంత ఆశను నిలబెట్టి ఉంచాయి.

ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక హత్య కేసు కాదు, అది ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు, రాజకీయాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలకు ఒక పరీక్షగా మారింది. సునీత పోరాటం చివరి వరకు కొనసాగుతుందో లేదో కాలమే చెప్పాలి. కానీ, సీబీఐ వైఖరి మాత్రం ఆమె ఆశలకు ఒక ముగింపు పలికిందనే భావన అందరిలో వ్యక్తమవుతోంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button