Just SportsLatest News

RCB : డి క్లెర్క్ విధ్వంసం.. ముంబైకి ఆర్సీబీ షాక్

RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది

RCB

మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పాకిచ్చింది. నసారీ ఆల్ రౌండర్ డి క్లెర్క్ అద్భుత పోరా టంతో ఓడిపోయే మ్యాచ్ లో గెలిచింది. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 67 పరుగులకే 4 కోల్పోయింది. అమేలియా కెర్ , సీవర్ బ్రంట్ నిరాశపరిస్తే జి.కమిలిని 32, హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు చేశారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సజీవన్ సజన ముంబైని ఆదుకుంది. విధ్వంసకర బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది.

కేవలం 25 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్తో 45 పరుగులు చేసింది. అటు నికోలా కేరీ కూడా ధాటిగా ఆడి 29 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లతో డిక్లెర్క్ 4 వికెట్లతో రాణించింది. ఛేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడుగా ఆడింది.

RCB
RCB

ఓపెనర్లు గ్రీన్ హ్యారిస్, స్మృతి మంధాన తొలి వికెట్ కు 40 పరుగులు జోడించారు. మంధాన 18, హ్యారిన్ 25 పరుగులకు ఔటవగా.. తర్వాత ఆర్సీబీ మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి , డిక్లెర్క్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 52 పరుగులు జోడించారు.

అయితే కీలక సమయంలో అరుంధతి రెడ్డి ఔటవడం, చివర్లో ముంబై బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ ఓడిపోయేలా కనిపించింది. కానీ డి క్లెర్క్ మాత్రం పోరాటం ఆపలేదు. చివరి ఓవర్ లో విజయం కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా.. బ్రంట్ వేసిన ఆ ఓవర్ మొదటి రెండు బాల్స్ లో పరుగులేమీ రాలేదు.

తర్వాత వరుసగా 6, 4, 6, 4 బాదడంతో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో గెలిచింది. అంతకుముందు స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను అలరించాయి. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సింగ్ యోయో హనీ సింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ODI:తుది కూర్పే సవాల్ ..న్యూజిలాండ్‌తో తొలి వన్డే

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button