Just NationalLatest News

New rules:సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్

New rules: ఆదాయపు పన్ను గడువు పొడిగింపు నుంచి పోస్టల్ సేవల మార్పుల వరకు, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ముఖ్యమైన మార్పులను ఇప్పుడు పరిశీలిద్దాం.

New rules

ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్లోకి అడుగుపెట్టగానే, దేశంలో అనేక ఆర్థిక, సామాజిక అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధనలు నేరుగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. ఆదాయపు పన్ను గడువు పొడిగింపు నుంచి పోస్టల్ సేవల మార్పుల(New rules) వరకు, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ముఖ్యమైన మార్పులను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆదాయపు పన్ను దాఖలు గడువు పొడిగింపు…ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది ఒక పెద్ద ఉపశమనం. సాధారణంగా జూలై 31 వరకు ఉండే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువును, ఈసారి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. అకౌంట్లను ఆడిట్ చేయాల్సిన సంస్థలకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల, ఎలాంటి అవాంతరాలు లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి అవకాశం లభిస్తుంది.

new rules
new rules

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) గడువు.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో అవకాశం లభించింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను ఎంపిక చేసుకోవడానికి గతంలో జూన్లో ముగిసిన గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఇది తక్కువ స్పందన కారణంగా తీసుకున్న నిర్ణయం. ఈ స్కీమ్ NPS కింద ఉన్న ఉద్యోగులకు ఒక మెరుగైన పెన్షన్ వ్యవస్థను అందిస్తుంది.

ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పు..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన మార్పు అమల్లోకి వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి కొన్ని రకాల లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్ నిబంధనలు మారాయి. డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ వెబ్‌సైట్లు మరియు కొన్ని ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద చేసే లావాదేవీలపై ఇకపై క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రివార్డ్ పాయింట్లు లభించవు. ఈ మార్పు లక్షలాది మంది ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ప్రభావం చూపనుంది.

new rules
new rules

వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి..వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు. ఇది బంగారం హాల్‌మార్కింగ్ లాగానే, వెండి స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. ఈ చర్య వల్ల నకిలీ ఆభరణాల విక్రయాలు తగ్గి, కస్టమర్లకు రక్షణ లభిస్తుంది. జ్యువెలరీ మార్కెట్‌లో పారదర్శకత పెంచడానికి ఈ నిబంధన ఎంతో తోడ్పడుతుంది.

స్పీడ్ పోస్ట్‌లో రిజిస్టర్డ్ పోస్ట్ విలీనం..ఇండియా పోస్ట్ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా, రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రిజిస్టర్డ్ మెయిల్స్ స్పీడ్ పోస్ట్ ద్వారానే డెలివరీ చేయబడతాయి. దీనివల్ల రిజిస్టర్డ్ పోస్ట్ కేటగిరీ ప్రత్యేకత ముగిసిపోతుంది. ఈ మార్పుల(New rules) వల్ల పోస్టల్ సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మారుతాయని భావిస్తున్నారు.ఈ మార్పులు(New rules) దేశవ్యాప్తంగా వివిధ రంగాలపై, ముఖ్యంగా ప్రజల ఆర్థిక జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఈ కొత్త నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Bigg Boss: బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రయోగం ఫెయిలా? సక్సెసా?

Related Articles

Back to top button