Just TelanganaJust SpiritualLatest News

Ganesh immersion: పర్యావరణం కోసం గణేశ్ నిమజ్జనం..హైదరాబాద్‌లో కష్టంగా ఎందుకు మారుతుంది?

Ganesh immersion: మట్టి విగ్రహాలను కొని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లో నిమజ్జనం చేయాలనుకున్న భక్తులు, సరిగా లేని ఏర్పాట్ల వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Ganesh immersion

గణేష్ ఉత్సవాలు ముగియగానే, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయాలనే సందేశం బాగా వినిపిస్తోంది. కానీ, హైదరాబాద్‌లో ఈ మంచి ప్రయత్నానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. మట్టి విగ్రహాలను కొని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లో నిమజ్జనం (Ganesh immersion)చేయాలనుకున్న భక్తులు, సరిగా లేని ఏర్పాట్ల వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ప్రభుత్వాలు పర్యావరణ అనుకూల నిమజ్జనా(Ganesh immersion)న్ని ప్రోత్సహించినా, దానికి తగిన వసతులను కల్పించకపోవడమే దీనికి కారణం. బేగంపేట నివాసి లావణ్య తన 5 అడుగుల విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్తే, అక్కడ ఉన్న బేబీ పాండ్ కేవలం 4 అడుగుల లోతు మాత్రమే ఉంది. సింధీ కాలనీకి చెందిన రమేష్ రావుకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆయన చిన్న మట్టి విగ్రహం, పూజా సామాగ్రితో ఆర్టిఫిషియల్ పాండ్‌కు వెళ్తే, అది పూర్తిగా నిండిపోయిందని చెప్పి హుస్సేన్‌సాగర్‌కు వెళ్లమని చెప్పారు. ఇలాంటి పరిస్థితి పర్యావరణంపై ఆసక్తి ఉన్నవారికి నిరాశను మిగులుస్తుంది.

దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేదానిపై జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా కొన్ని వాస్తవాలను అంగీకరిస్తున్నారు. నిమజ్జనం(Ganesh immersion) రోజున వేలాది విగ్రహాలు వస్తుండటంతో, ఆర్టిఫిషియల్ పాండ్స్ కొన్ని గంటల్లోనే నిండిపోతున్నాయి. చాలా పాండ్స్ లోతు తక్కువగా ఉండటం వల్ల కూడా నిమజ్జనం సజావుగా సాగడం లేదు.

Ganesh immersion
Ganesh immersion

జీహెచ్‌ఎంసీ ఈ సంవత్సరం 74 ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేసినా కూడా.. భారీ సంఖ్యలో వచ్చే విగ్రహాలను హ్యాండిల్ చేయడానికి అవి సరిపోవడం లేదు. అధికారులు పండుగ ముందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. నిమజ్జనం రోజున వాటిని పర్యవేక్షించడంలో విఫలమవుతున్నారు. బేబీ పాండ్స్ దగ్గర తగిన సంఖ్యలో పోలీసులు, వాలంటీర్లు లేకపోవడం వల్ల భారీ రద్దీ ఏర్పడుతుంది. దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక గుంపును అనుసరించి, చివరకు కాలుష్యం కలిగించే పెద్ద చెరువుల వైపు వెళ్తున్నారు.

పర్యావరణ కార్యకర్తలు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధ్రువంశ్ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ అనుకూల నిమజ్జనాన్ని ప్రోత్సహించినా, సరైన మౌలిక వసతులు లేకుండా ఇది సాధ్యం కాదని పేర్కొంటున్నారు. దీనివల్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల వచ్చే కాలుష్యం మళ్లీ కొనసాగుతుంది.

ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే, కేవలం అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా, ప్రభుత్వం మరిన్ని లోతైన బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసి, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచాలి. పర్యావరణ అనుకూల గణేశ్ నిమజ్జనం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రజలందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. లేకపోతే పర్యావరణ అనుకూల నిమజ్జనం అనేది కేవలం ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతుంది.

Pawan Kalyan:‘ఉస్తాద్ భగత్ సింగ్’ న్యూ లుక్ .. పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్ అదిరింది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button