Just EntertainmentLatest News

Tollywood :టాలీవుడ్ కెమెరాలకు తాళం .. రవితేజ మాస్ జాతరకు బ్రేక్

Tollywood : రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్( Raviteja Mass Jathara) జాతర సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా వారం రోజుల షూటింగ్ మిగిలి ఉండగా ఈ ఆదేశాల వల్ల సెట్‌లో పనులు ఆగిపోయాయి.

Tollywood:

టాలీవుడ్‌లో వేతనాల పెంపు డిమాండ్ చుట్టూ మొదలైన ఈ వివాదం ఇప్పుడు పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతోంది. కొద్దిరోజులుగా సినీ కార్మికులు నిర్మాతలపై ఒత్తిడి తెస్తూ, వేతనాలు పెంచకపోతే షూటింగ్స్ ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, నిర్మాతల మండలి, కార్మిక సంఘాల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి కానీ ఏదీ ఫలితం ఇవ్వలేదు. ఇరువర్గాలూ తమ తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో చివరికి ఫెడరేషన్ నేటి నుంచి టాలీవుడ్‌(Tollywood)లో అన్ని షూటింగ్స్ నిలిపివేయాలని తేల్చేసింది.

ఈ నిర్ణయం వల్ల కార్మికుల వేతనాల పెంపునకు ఇప్పటికే అంగీకరించిన కొన్ని సినిమాలు కూడా బలవంతంగా ఆగిపోతున్నాయి. నిర్మాతల మండలి (ఫిలిం ఛాంబర్) శుక్రవారం నుంచే షూటింగ్స్ ఆపేయమని ఆదేశించగా, ఫెడరేషన్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చెప్పిన ప్రకారం, ఇప్పటికే షెడ్యూల్ చేసిన వాటిని పూర్తిచేయడానికి కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇది ప్రాక్టికల్‌గా అసాధ్యమే అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇప్పుడే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్( Raviteja Mass Jathara) జాతర సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా వారం రోజుల షూటింగ్ మిగిలి ఉండగా ఈ ఆదేశాల వల్ల సెట్‌లో పనులు ఆగిపోయాయి. ముందుగా ప్లాన్ ప్రకారం సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ హైప్ క్రియేట్ చేశాయి. కానీ షూటింగ్ నిలిచిపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Tollywood
Tollywood

ఇక మొత్తం ఇండస్ట్రీ దృష్టిలో ఈ ఆగిపోవడం చిన్న విషయం కాదు. రోజుకు టాలీవుడ్‌లో జరిగే షూటింగ్స్(Tollywood shootings) విలువ కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఒక పెద్ద సినిమా సెట్‌లో రోజుకు 200–300 మందికి పైగా పని చేస్తారు. ఒక్కో సినిమా యూనిట్ రోజుకు 25–30 లక్షలు ఖర్చు చేస్తుంది. ఇప్పుడు అన్ని షూటింగ్స్ నిలిచిపోవడం వలన కొన్ని రోజుల్లోనే వందల కోట్ల నష్టం తలెత్తవచ్చని అంచనా. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదు, లైట్ బాయ్స్, సెట్ వర్కర్స్, డ్రైవర్లు, ఫుడ్ సప్లై వర్కర్స్ వరకు అందరూ నష్టపోతారు.

ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే..కార్మికులు చెబుతున్న వేతన పెంపు శాతం నిర్మాతలకు భారమవుతోంది. నిర్మాతలు చెబుతున్న ఖర్చు నియంత్రణ ప్రతిపాదనలు కార్మిక సంఘాలకు సరిపోవడం లేదు. మధ్యలో ఎవరూ త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. నిర్మాతలు “మేము కూడా లాభాలు తగ్గిపోతున్న కాలంలో ఉన్నాం” అంటుంటే, కార్మికులు ఖర్చులు పెరిగిపోయాయి, మేము వెనక్కి తగ్గం అంటున్నారు. ఈ తగవు ఎవరు ముందుగా తగ్గుతారన్న ‘ప్రతిష్ట’ స్థాయికి చేరుకోవడంతో పరిష్కారం ఇంకా దూరంగా కనిపిస్తోంది.

నా అంచనా ప్రకారం, ఈ వివాదం ఇంకో వారం కూడా సాగితే, టాలీవుడ్‌కు కనీసం రూ150–రూ.200 కోట్లు నష్టం తప్పదు. చిన్న సినిమాలు రిలీజ్ డేట్ మిస్ అవుతాయి, పెద్ద సినిమాలు మార్కెటింగ్ ప్లాన్‌లను మళ్లీ డిజైన్ చేయాల్సి వస్తుంది. ఫెస్టివల్ సీజన్‌లో రావాల్సిన సినిమాలు వాయిదా పడితే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌కి పెద్ద దెబ్బ అవుతుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button