Just NationalLatest News

Economic corridor:చరిత్ర సృష్టించబోతున్న ఎకనామిక్ కారిడార్..ఆ 3 రాష్ట్రాల మధ్య భారీగా తగ్గనున్న దూరం

Economic corridor: ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తయితే, ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్న 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోతుంది.

Economic corridor

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ,విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఎకనామిక్ కారిడార్(economic corridor) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పూర్తయితే, ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్న 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గిపోతుంది.

ప్రాజెక్టు(Economic corridor) వివరాలు:

  • వ్యయం..సుమారు రూ. 16,482 కోట్లు.
  • దూరం.. 465 కిలోమీటర్లు (గ్రీన్‌ఫీల్డ్ మార్గం).
  • లక్ష్యం.. డిసెంబర్ 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య ఉన్న జాతీయ రహదారి-26 మార్గం ద్వారా ప్రయాణిస్తే దాదాపు 597 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ద్వారా ప్రయాణ దూరం సుమారు 132 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ దూరం తగ్గడం వలన రవాణా సమయంతో పాటు, ఇంధన ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి.

ఈ ఎకనామిక్ కారిడార్ (Economic corridor)కేవలం రెండు నగరాలను కలపడం మాత్రమే కాదు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య రంగానికి ఇది ఒక వరంలా మారనుంది.

Economic corridor
Economic corridor

ఛత్తీస్‌గఢ్ ,ఒడిశాలోని పరిశ్రమలు నేరుగా , వేగంగా విశాఖపట్నం పోర్టుకు అనుసంధానమవుతాయి. దీంతో ఎగుమతులు వేగవంతమై, లాజిస్టిక్స్ రంగం బలోపేతమవుతుంది. సరుకు రవాణా ఖర్చు తగ్గి, వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి.

ఈ హైవే పనుల వల్ల స్థానిక రైతులు తమ భూముల విలువ అమాంతం పెరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరం రూ. 15 లక్షలు పలికిన భూమి, ఇప్పుడు రూ. 1.5 కోట్లకు చేరిందంటే ఈ ప్రాజెక్టు ఆర్థిక ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మార్గం ద్వారా ట్రక్కు యజమానులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. గతంలో ఒకటిన్నర రోజులు పట్టే ప్రయాణం, ఇప్పుడు పగలు మొదలుపెడితే రాత్రికల్లా పూర్తవుతుంది. డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం కూడా తగ్గుతాయి.

ఈ కారిడార్(Economic corridor) ఛత్తీస్‌గఢ్, ఒడిశా , ఆంధ్రప్రదేశ్‌లోని అనేక మారుమూల, గిరిజన ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది.

ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే తూర్పు, మధ్య భారతదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడి, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది ఒక కీలకమైన మలుపు కానుంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button